- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Jeevan Reddy: జీవన్రెడ్డి నారాజ్
జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్కుమార్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలియడంతో జగిత్యాలలోని నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.
జగిత్యాల ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై మనస్తాపం
ఇంకా తనకు పార్టీ, పదవి ఎందుకని అనుచరులతో వ్యాఖ్య
నచ్చజెప్పేందుకు రంగంలోకి దిగిన మంత్రి శ్రీధర్బాబు
జీవన్రెడ్డితో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్బాబు, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల ఇన్ఛార్జి నర్సింగరావు, విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్
జగిత్యాల, న్యూస్టుడే: జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్కుమార్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలియడంతో జగిత్యాలలోని నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. జీవన్రెడ్డి మనస్తాపం చెందినట్లు తెలియడంతో సీఎం రేవంత్రెడ్డి సూచన మేరకు మంత్రి శ్రీధర్బాబు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రెండు గంటలపాటు భేటీ అయ్యారు. ఆయన మనోభావాల్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మంత్రితో భేటీ అనంతరం జీవన్రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసి ఉదయమే జీవన్రెడ్డి అనుచరులు జగిత్యాలలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన వారితో మాట్లాడుతూ ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన పరిస్థితి రావడమేంటని, తనకు మాట వరసకైనా చెప్పకుండా చేర్చుకోవడమేమిటని నొచ్చుకున్నారు. తన వయసుకు, 40 సంవత్సరాల సీనియారిటీకి అధిష్ఠానం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు.. ఎమ్మెల్సీ పదవి ఎందుకు అని అన్నారు. ఎమ్మెల్సీ తీవ్ర మనస్తాపం చెందారని తెలిసి దిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచన మేరకు మంత్రి డి.శ్రీధర్బాబు సాయంత్రం 6:30 గంటలకు జీవన్రెడ్డి నివాసానికి చేరుకుని దాదాపు రెండు గంటలపాటు మాట్లాడారు. ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మ్కణ్కుమార్, ఆది శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, కోరుట్ల ఇన్ఛార్జి నర్సింగరావు తదితరులతో కలిసి ఆయనకు నచ్చజెప్పారు. అందరికీ మార్గదర్శకులుగా ఉన్న మీరు నిరాశ చెందవద్దని కోరారు.
జీవన్రెడ్డే మాకు పెద్దదిక్కు: మంత్రి శ్రీధర్బాబు
జీవన్రెడ్డే మాకు పెద్ద దిక్కు అని మంత్రి డి.శ్రీధర్బాబు అన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, లేకున్నా కార్యకర్తలు, ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి ఆయన. వారి బాటలో మేం నడుస్తున్నాం. ప్రభుత్వానికి అండగా ఉండేందుకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నాం. కార్యకర్తల మనోభావాలను గౌరవించే బాధ్యత పార్టీపై ఉంది. జీవన్రెడ్డి అధైర్యపడొద్దు. ఆయన మనోభావాలు, కష్టాలను సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకువెళ్లి అన్నివిధాలా న్యాయం జరిగేలా చూస్తాం’’ అని శ్రీధర్బాబు చెప్పారు. ఆయనకు ఏమైనా హామీ ఇచ్చారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఆయన పెద్దదిక్కు ఆయనకు తామేం హామీ ఇస్తామన్నారు.
ఎవరితో పోరాటం చేశానో వారినే తీసుకున్నారు: జీవన్రెడ్డి
భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని శాసనమండలి సభ్యుడు టి.జీవన్రెడ్డి అన్నారు. మంత్రి మాట్లాడి వెళ్లిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దశాబ్దకాలం ఎవరితో పోరాటం చేశామో ఆ ఎమ్మెల్యేనే ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానన్నారు. శాసనసభలో సంఖ్యాబలం కారణమో, ప్రభుత్వానికి అండగా ఉండేందుకో ఎమ్మెల్యేను చేర్చుకునేముందు కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోవాల్సిందని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో అనుకున్న ఫలితం రాకున్నా ప్రజలకు అందుబాటులో ఉన్నానని, భవిష్యత్తులో కూడా ఉంటానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్లో తెదేపా శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. -
ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
డెవిల్ను నియంత్రించాం.. ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదు: చంద్రబాబు
ఐదేళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. -
కృష్ణాడెల్టాకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదు: మంత్రి నిమ్మల
కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. -
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడింది: మాజీ ఎంపీ వినోద్
తెలంగాణలో శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని భారాస నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. -
వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్ అయ్యన్న
ఐదేళ్లు పాలించిన వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వేయలేదని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. -
కేసీఆర్పై విశ్వాసం లేకే కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
భారాస అధ్యక్షుడు కేసీఆర్పై విశ్వాసం లేకపోవడంతోనే ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. -
కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఆయన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. -
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను గత ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. -
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస విద్యార్థి నేతల ఆందోళన.. పలువురి అరెస్టు
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస అనుబంధ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. రహదారిపై బైఠాయించి అనుబంధ విద్యార్థి సంఘం నేతలు నిరసన తెలిపారు. -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. -
ఆడిన మాట తప్పని రాజస్థాన్ మంత్రి కిరోడిలాల్
భాజపా సీనియర్ నేత, రాజస్థాన్ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి కిరోడి లాల్ మీనా (72) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆమోదించలేదు. -
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు
కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైనా కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్లో గురువారం కేసు నమోదుచేశారు. -
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల నిర్వాహకులేనని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. -
‘ఆమెను రాజమాత అని మీరెందుకు తిట్టారు? అక్కడి నుంచే పార్టీ నాశనం’
‘అంతా మీరే చేశారు’ ఇది ఒక సినిమాలోని పాపులర్ డైలాగు. ఇప్పుడదే డైలాగును వైకాపాలో తాజా మాజీలు ఒకరిపై ఒకరు గట్టిగానే ప్రయోగించుకున్నారు. -
భారాసకు భారీ షాక్
భారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. -
పిన్నెల్లి మంచోడు...
‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు.. కాబట్టే 2009 నుంచి 2019 వరకు నాలుగుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు ఆయన్ను దీవించారు. -
ప్రజాతీర్పునకు వక్రభాష్యాలా..?
ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా.. జగన్లో మార్పు రాలేదు. ప్రజాతీర్పును గౌరవించేందుకు ఆయన ఇంకా సిద్ధపడలేదు. ఓటమిని అంగీకరించక, రోజుకో మాట చెబుతూనే ఉన్నారు. -
ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం నేరాలు కావా?
పోలింగ్ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో భారీ విధ్వంసం సృష్టించి, ఈవీఎంలను ధ్వంసం చేసి, అడ్డుకోబోయిన సీఐపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకూడదా అని వైకాపా అధినేత జగన్ను తెదేపా నేతలు ప్రశ్నించారు. -
ముగ్గురాయి గనుల్లో అక్రమాలు.. ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల నష్టం
మంగంపేట ముగ్గురాయి గనుల్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఆరోపించారు. -
ప్రజాతీర్పు శిరోధార్యం
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, వారి తీర్పే శిరోధార్యమని, వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో 16మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
-
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్
-
‘సింగింగ్’ చాయ్వాలా..! పాటలు పాడుతూ.. టీ చేస్తూ..
-
హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
-
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ