- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
MLA Kolikapudi: బాధితులకు న్యాయం చేయలేనప్పుడు పదవి శాశ్వతం కాదు: ఎమ్మెల్యే కొలికపూడి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫేస్బుక్ వేదికగా సంచలన ప్రకటన చేశారు.
తిరువూరు: బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. కంభంపాడులో వైకాపా నేత కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి కొంత మేర కూల్చివేయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. పదవి శాశ్వతం కాదని.. బాధితులకు న్యాయం చేయలేనపుడు తన లాంటి వారు రాజకీయాల్లో కూడా అవసరం లేదన్నారు.
‘‘కంభంపాడులో చెన్నారావు అరాచకాలతో ఎంతో మంది గ్రామం విడిచి వెళ్లిపోయారు. చంద్రబాబు, కేశినేని చిన్ని కాన్వాయ్ల మీద రాళ్ల దాడి చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే అప్పటి మంత్రి దేవినేని ఉమా.. చెన్నారావుకు భయపడి ఆ గ్రామంలో పర్యటన రద్దు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా కడితే ఐదు నిమిషాల్లో కాళ్లు, చేతులు విరగ్గొడతారు. గ్రామంలో ప్రజలు ఓటేసేందుకు వెళ్లకుండా రోడ్డుపై ముళ్ల కంప వేస్తారు. దుకాణాల్లో సరకులు తీసుకుంటారు.. డబ్బులు అడిగితే కొడతారు. ఇళ్లలోకి చొరబడి మహిళలను వేధిస్తారు. దారినపోయేవారిని ఆపి బైక్లు లాక్కుంటారు. భయపెట్టి, దాడులు చేసి భూములు రాయించుకుంటారు. కోడిపందేలు, పేకాట, మట్టి, ఇసుక అక్రమ వ్యాపారం.. ఇలా చిన్న గ్రామంలో రోజుకి రూ.లక్ష అక్రమ సంపాదన. చెన్నారావు అరాచకాల వల్ల గతంలో టీడీపీలో ఉన్న ప్రస్తుత వైకాపా నేత ఇతనిపై రౌడీషీట్ పెట్టించారు. వైకాపా ఎమ్మెల్యేగా పనిచేసిన రక్షణ నిధి.. నిబంధనలకు విరుద్ధంగా రౌడీషీట్ రద్దు చేయించారు. అధికారులందరూ అతనికి దాసోహం. గత ఐదేళ్ల వైకాపా పాలనలో రూ.50 కోట్ల అక్రమ సంపాదన.
ఇవన్నీ విన్న తర్వాత కూడా ఆ గ్రామంలో ప్రచారానికి వెళ్లా.. తెదేపా జెండా ఎగరేశా. ప్రజలు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసే ధైర్యం కల్పించా. ఆ గ్రామంలో నాకు భారీ మెజార్టీ వచ్చింది. నాకు భయపడి.. ఇసుక, మట్టి దందాలు ఆపేశారు. కేశినేని చిన్నిపై రాళ్ల దాడి చేసిన చెన్నారావుపై కేసు పెడితే పోలీసులు వారం రోజులు పట్టించుకోలేదు. నిన్నటి ఘటన నేపథ్యంలో ఈరోజు అరెస్టు చూపిస్తున్నారు. నలుగురిని కొట్టి వాళ్ల స్థలాలు లాక్కుని, పక్కనున్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు. అక్రమ నిర్మాణం ఆపాలని రెవెన్యూ అధికారులకు చెబితే.. అతన్ని కాపాడేందుకు వంద కథలు చెప్పారు. ఘటనకు 240 గంటల ముందు సోషల్ మీడియా ద్వారా ప్రకటించినా అధికారులు స్పందించలేదు. చివరికి నేను స్వయంగా రంగంలోకి దిగి, గత్యంతరం లేక వేలాది మంది బాధితులతో నిరసన చేపడితే .. చివరికి నోటీసులిచ్చి నిర్మాణం ఆపారు. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవి శాశ్వతం కాదు. నాలాంటి వాడు రాజకీయాల్లో కూడా అవసరం లేదు’’ అని ఎమ్మెల్యే కొలికపూడి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఎమ్మెల్యే కొలికపూడి వివరణ కోరిన సీఎం చంద్రబాబు
ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడులో మంగళవారం జరిగి ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని పిలిపించి వివరణ కోరారు. కొందరు అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదని, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని తాను కోరినా వారి నుంచి స్పందన లేనందుకే వెళ్లాల్సి వచ్చిందని కొలికపూడి వివరించారు. 2013లో చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లదాడి, ఇటీవల ఎన్నికల సందర్భంగా కేశినేని చిన్నిపై రాళ్ల దాడి ఘటనను వివరించారు. చట్ట పరిధిలో దోషుల్ని శిక్షిద్దాం.. క్షేత్ర స్థాయికి వ్యక్తిగతంగా వెళ్లొద్దని చంద్రబాబు కొలికపూడికి సూచించినట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
డెవిల్ను నియంత్రించాం.. ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదు: చంద్రబాబు
ఐదేళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. -
కృష్ణాడెల్టాకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదు: మంత్రి నిమ్మల
కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. -
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడింది: మాజీ ఎంపీ వినోద్
తెలంగాణలో శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని భారాస నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. -
వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్ అయ్యన్న
ఐదేళ్లు పాలించిన వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వేయలేదని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. -
కేసీఆర్పై విశ్వాసం లేకే కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
భారాస అధ్యక్షుడు కేసీఆర్పై విశ్వాసం లేకపోవడంతోనే ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. -
కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఆయన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. -
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను గత ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. -
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస విద్యార్థి నేతల ఆందోళన.. పలువురి అరెస్టు
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస అనుబంధ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. రహదారిపై బైఠాయించి అనుబంధ విద్యార్థి సంఘం నేతలు నిరసన తెలిపారు. -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. -
ఆడిన మాట తప్పని రాజస్థాన్ మంత్రి కిరోడిలాల్
భాజపా సీనియర్ నేత, రాజస్థాన్ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి కిరోడి లాల్ మీనా (72) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆమోదించలేదు. -
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు
కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైనా కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్లో గురువారం కేసు నమోదుచేశారు. -
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల నిర్వాహకులేనని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. -
‘ఆమెను రాజమాత అని మీరెందుకు తిట్టారు? అక్కడి నుంచే పార్టీ నాశనం’
‘అంతా మీరే చేశారు’ ఇది ఒక సినిమాలోని పాపులర్ డైలాగు. ఇప్పుడదే డైలాగును వైకాపాలో తాజా మాజీలు ఒకరిపై ఒకరు గట్టిగానే ప్రయోగించుకున్నారు. -
భారాసకు భారీ షాక్
భారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. -
పిన్నెల్లి మంచోడు...
‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు.. కాబట్టే 2009 నుంచి 2019 వరకు నాలుగుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు ఆయన్ను దీవించారు. -
ప్రజాతీర్పునకు వక్రభాష్యాలా..?
ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా.. జగన్లో మార్పు రాలేదు. ప్రజాతీర్పును గౌరవించేందుకు ఆయన ఇంకా సిద్ధపడలేదు. ఓటమిని అంగీకరించక, రోజుకో మాట చెబుతూనే ఉన్నారు. -
ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం నేరాలు కావా?
పోలింగ్ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో భారీ విధ్వంసం సృష్టించి, ఈవీఎంలను ధ్వంసం చేసి, అడ్డుకోబోయిన సీఐపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకూడదా అని వైకాపా అధినేత జగన్ను తెదేపా నేతలు ప్రశ్నించారు. -
ముగ్గురాయి గనుల్లో అక్రమాలు.. ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల నష్టం
మంగంపేట ముగ్గురాయి గనుల్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఆరోపించారు. -
ప్రజాతీర్పు శిరోధార్యం
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, వారి తీర్పే శిరోధార్యమని, వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. -
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ విఫలం: కేటీఆర్
రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే రాహుల్ గాంధీ దాని స్ఫూర్తిని కాపాడడంలో విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
-
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
-
ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
-
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
-
మీ ఆగ్రహం నన్ను తాకింది: ప్రధానిగా చివరి ప్రసంగంలో రిషి సునాక్ భావోద్వేగం
-
రివ్యూ: వెబ్సిరీస్: మీర్జాపూర్ సీజన్-3.. క్రైమ్, యాక్షన్ సిరీస్-3 మెప్పించిందా?