- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
YSRCP: కళ్లు నెత్తికెక్కిన మంత్రులను చాచి కొట్టిన ఓటర్లు
పదవి దక్కినప్పటి నుంచి విర్రవీగుతూ.. ఇష్టానుసారం వ్యవహరించి.. దౌర్జన్యాలు, దందాలు చేసి.. నోటి దురుసుతో విరుచుకుపడి.. కళ్లు నెత్తికెక్కిన.. మంత్రులు అందరికీ ఓటర్లు బుద్ధి చెప్పారు.
ఈనాడు-అమరావతి: పదవి దక్కినప్పటి నుంచి విర్రవీగుతూ.. ఇష్టానుసారం వ్యవహరించి.. దౌర్జన్యాలు, దందాలు చేసి.. నోటి దురుసుతో విరుచుకుపడి.. కళ్లు నెత్తికెక్కిన.. మంత్రులు అందరికీ ఓటర్లు బుద్ధి చెప్పారు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వారందరినీ చాచి కొట్టినట్లు ఓడించారు. తొలివిడత మూడేళ్లూ, తర్వాత రెండేళ్లూ మంత్రులుగా కొనసాగిన వారెవరికి విజయం దక్కలేదు. అయిదు సామాజిక వర్గాలకు చెందిన వారికి.. అయిదు ఉప ముఖ్యమంత్రుల పదవులంటూ ఆయా వర్గాల ఓట్లను పట్టేయచ్చని జగన్ వేసిన ప్రణాళికను ఓటర్లు ఏమాత్రం పట్టించుకోలేదు. తరతమ బేధం లేకుండా ఉపముఖ్యమంత్రులందరినీ ఓడించారు. ప్రస్తుత సిట్టింగ్ మంత్రులే కాకుండా, తొలి విడతలో మూడేళ్లు మంత్రులుగా పనిచేసిన వారిలో కూడా ఏ ఒక్కరూ గెలవలేదు. మొన్నటి వరకు మంత్రిగా కొనసాగిన గుమ్మనూరు జయరాం మాత్రం ఎన్నికలకు ముందు తెదేపాలో చేరి, గుంతకల్లు నుంచి పోటీచేసి విజయం సాధించారు.
ఉప ముఖ్యమంత్రులంతా ఔట్
ప్రస్తుత సిట్టింగ్ ఉప ముఖ్యమంత్రులైన కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), అంజాద్ బాషా (కడప), పీడిక రాజన్నదొర (సాలూరు) ఓటమి చవిచూశారు. అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఓడిపోయారు. ఇప్పటివరకు సిట్టింగ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ స్థానమైన గంగాధర నెల్లూరు నుంచి అతని కుమార్తె కృపాలక్ష్మిని పోటీలో నిలపగా, ఆమె కూడా ఆమె ఓటమిపాలయ్యారు.
బోల్తా కొట్టిన అమాత్యులు
సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అన్నిశాఖల మంత్రులను ఓటర్లు ఊడ్చేశారు. ప్రస్తుత సిట్టింగ్ మంత్రుల్లో.. ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), సీదిరి అప్పలరాజు (పలాస), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), గుడివాడ అమర్నాథ్ (గాజువాక), దాడిశెట్టి రాజా (తుని), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (రాజమహేంద్రవరం గ్రామీణ), పినిపే విశ్వరూప్ (అమలాపురం), తానేటి వనిత (గోపాలపురం), కారుమూరి వెంకట నాగేశ్వరరావు (తణుకు), జోగి రమేశ్ (పెనమలూరు), మేరుగు నాగార్జున (సంతనూతలపాడు), విడదల రజని (గుంటూరు పశ్చిమ), అంబటి రాంబాబు (సత్తెనపల్లి), ఆదిమూలపు సురేష్ (కొండపి), కాకాణి గోవర్దన్రెడ్డి (సర్వేపల్లి), ఆర్కే రోజా (నగరి), బుగ్గన రాజేంద్రనాథరెడ్డి (డోన్), కేవీ ఉషశ్రీచరణ్ (పెనుకొండ) ఓటమి చవిచూశారు.
- తొలి విడత మూడేళ్లపాటు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), పాముల పుష్పశ్రీవాణి (కురుపాం), ఆళ్ల నాని (ఏలూరు) ఓడిపోయారు. తొలి మూడేళ్లూ మంత్రులుగా ఉండి, ప్రస్తుతం బరిలో నిలిచిన అవంతి శ్రీనివాస్ (భీమిలి), కురసాల కన్నబాబు (కాకినాడ గ్రామీణ), చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఆచంట), కొడాలి నాని (గుడివాడ), వెలంపల్లి శ్రీనివాస్ (విజయవాడ సెంట్రల్), మేకతోటి సుచరిత (తాడికొండ), బాలినేని శ్రీనివాసులురెడ్డి (ఒంగోలు) ఓటమి చవిచూశారు. నరసరావుపేట నుంచి లోక్సభ స్థానానికి పోటీచేసిన మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్, అనంతపురం లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచిన మాజీ మంత్రి ఎం.శంకరనారాయణ కూడా ఓటమిపాలయ్యారు.
- మాజీ మంత్రి పేర్ని నాని.. ఈసారి తన కుమారుడు కిట్టును మచిలీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయించగా, ఓటర్లు తిరస్కరించారు. తొలి విడతలో మంత్రిగా చేసి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న పిల్లి సుభాష్చంద్రబోస్.. ఈసారి కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్ని బరిలో నిలిపినా ఓటమి తప్పలేదు.
తాజా, మాజీలు 39 మందిలో.. ఒక్కరే..
జగన్ ప్రభుత్వంలో రెండు దఫాలుగా 41 మంది మంత్రులు పనిచేయగా.. వారిలో నేరుగా పోటీచేసిన 35 మందితోపాటు, తమస్థానంలో కుమారులు, కుమార్తెలను బరిలో నిలిపిన ముగ్గురు మంత్రులకు కూడా ఓటమి తప్పలేదు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే విజయం సాధించారు. రెండు దఫాలు మంత్రిగా కొనసాగిన గుమ్మనూరు జయరాం మాత్రం, ఎన్నికలకు ముందు తెదేపా గూటికి చేరారు. గుంతకల్లు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు.
- తొలి దఫా 25 మంది మంత్రులు ఉండగా, అందులో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా వెళ్లారు. వారి స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు మంత్రి వర్గంలోకి వచ్చారు. రెండో దఫా మంత్రివర్గంలో 25 మందికిగాను 11 మందిని కొనసాగించారు. 14 మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
- నారాయణస్వామి తన కుమార్తెను, పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్ని నాని తమ కుమారులను పోటీ చేయించినా ప్రయోజనం లేకపోయింది.
- రాజ్యసభ సభ్యుడైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఒక్కరే ఈసారి ఎన్నికల బరిలో నిలబడలేదు. మేకపాటి గౌతమ్రెడ్డి అమాత్యునిగా ఉండగానే మృతిచెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు నాయకుడు.. జగన్ ప్రతినాయకుడు
రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు దిల్లీ వెళితే.. హింసా రాజకీయాల్ని ప్రోత్సహించే వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్లారని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. -
అసెంబ్లీకి ఐదేళ్లలో సున్నం కూడా వేయలేదు
వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని నాశనం చేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరం కలసి మంచి రాజధానిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు హైదరాబాద్లో ఘనస్వాగతం
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. -
చిత్తూరులో వైకాపాకు భారీ షాక్
వైకాపాకు చిత్తూరులో భారీ షాక్ తగిలింది. నగర మేయర్ ఎస్.అముద ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
దర్శి వైకాపా ఎమ్మెల్యే హల్చల్
అధికార అండతో ఇన్నాళ్లూ దౌర్జన్యాలకు పాల్పడిన వైకాపా నాయకులు ఇప్పుడు కూడా అదే మార్గంలో వెళుతున్నారు. -
సొంత బాబాయ్ చనిపోయినా.. జగన్ ఇంతలా స్పందించలేదు
తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే పట్టించుకోని జగన్.. ఈవీఎం పగలగొట్టి, సీఐ హత్యకు యత్నించి జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో వెళ్లడం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. -
భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చితి ఏర్పడకుండా చూడాలి: సీపీఎం
రాజధాని అమరావతిపై భవిష్యత్తులో అనిశ్చితి, గందరగోళం ఏర్పడకుండా వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. -
ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
లోక్సభ హౌస్ కమిటీలో పురందేశ్వరికి చోటు
ఎంపీల వసతి, ఇతర సదుపాయాలను పర్యవేక్షించే లోక్సభ హౌస్ కమిటీ ఏర్పాటైంది. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్ శర్మ నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో 12 మంది సభ్యులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. -
పిన్నెల్లి వాసుల సమస్యపై కోర్టుకు వెళ్దాం
గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలప్పటి నుంచి పరిస్థితి కుదుటపడలేదని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్కు తెలిపారు. -
8న రాజమహేంద్రవరంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
రాజమహేంద్రవరంలో ఈ నెల 8న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు. -
ఓటమిపై కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు
మాజీ సీఎం, భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
భారాస అధికారిక సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. -
కేశవరావు రాజీనామాకు ఆమోదం
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చేసిన రాజీనామాను ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ శుక్రవారం ఆమోదించారు. -
తెలంగాణ దాటితే కేసీఆర్ను ఎవరూ గుర్తుపట్టరు
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో కూర్చొని ఆ పార్టీ శ్రేణులకు పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన స్పీకర్
ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే విషయమై దాదాపు నెల రోజులుగా పశ్చిమబెంగాల్ రాజ్భవన్, ఆ రాష్ట్ర శాసనసభ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో వివాదం తలెత్తింది. -
హాథ్రస్పై రాజకీయం చేయను
దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్ తొక్కిసలాటపై తాను రాజకీయాలు చేయదలచుకోవడం లేదని, కానీ తప్పు రాష్ట్ర అధికార యంత్రాంగానిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నెల రోజుల్లో మోదీ ప్రభుత్వ పతనం
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, నెల రోజుల్లోపే అది కుప్పకూలడం ఖాయమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ అన్నారు. -
మండలి హస్తగతమే లక్ష్యం
తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దు
గద్వాల భారాస ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం గాంధీభవన్లో ఆందోళనకు దిగారు. -
పవన్కల్యాణ్ వల్లే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం: జగ్గారెడ్డి
జనసేన అధినేత పవన్కల్యాణ్ తెదేపాతో భాజపాకు పొత్తు కుదర్చకపోతే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చేది కాదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.