Andhra news: జగన్‌ జైలుకు పోయే సమయం ఆసన్నమైంది: మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

జగన్‌ మరోసారి జైలుకు పోయే సమయం ఆసన్నమైందని ఏపీ రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు.

Updated : 04 Jul 2024 20:09 IST

అమరావతి: జగన్‌ మరోసారి జైలుకు పోయే సమయం ఆసన్నమైందని ఏపీ రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.  ఐదేళ్లలో జగన్‌ చేసిన పాపాలే అతన్ని వెంటాడుతున్నాయన్నారు. అధికారం చేపట్టిన 21 రోజుల్లోనే చంద్రబాబు ఏమీ చేయలేదని జగన్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైకాపా హయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. వాలంటీర్లతో వైకాపా నేతలు ఊడిగం చేయించుకున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో వైకాపా నేతలు చేసిన అవినీతిని వెలికితీస్తామన్నారు. ఆ పార్టీ నేతలపై కక్ష సాధించే ఆలోచన తెదేపాకి లేదన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందేనని, ఐదేళ్లలో మాచర్లలో నరమేధం సృష్టించారని మండిపడ్డారు. తెదేపా బీసీ నేత తోట చంద్రయ్యను నడిరోడ్డుపై నరికి చంపారని ఆగ్రహం వ్యక్తం చేసారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని