- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Lok Sabha Elections Counting: 2.18 కోట్ల ఓట్లు.. 34 లెక్కింపు కేంద్రాలు
ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపూ నేడే
కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు టేబుళ్లు
ఈనాడు, హైదరాబాద్: ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మరోవైపు లోక్సభ ఎన్నికలతోపాటు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపూ మంగళవారమే జరగనుంది. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో రాష్ట్రంలోని లోక్సభ స్థానాలకు మే నెల 13వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు 34 ప్రాంతాల్లో 1,855 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లోనే సుమారు 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 275 టేబుళ్లు అందుబాటులో ఉంచారు. అధిక శాతం నియోజకవర్గాల్లో 18 నుంచి 21 రౌండ్లలో లెక్కింపు సాగుతుంది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి 49 మంది పరిశీలకులను నియమించింది. లెక్కింపు జరిగే ప్రతి టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుడికి బాధ్యతలు అప్పగించింది. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో అతి తక్కువగా 1,05,383 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో అక్కడ ఓట్ల లెక్కింపు తొలుత పూర్తి అవుతుందన్నది అంచనా.
రౌండ్ల వారీగా ఈవీఎంల తరలింపు
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముందుగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ల నుంచి తొలుత పోస్టల్ బ్యాలెట్ బాక్సులను బయటకు తీసుకొస్తారు. తరవాత ఈవీఎంలను తీసుకొస్తారు. ‘అందరూ ఒకే సమయంలో స్ట్రాంగ్ రూమ్లలోకి వెళ్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఇలా ఏర్పాట్లు చేశాం. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సిబ్బంది, ఈవీఎం ఓట్ల లెక్కింపు సిబ్బంది వేరువేరుగా ఉంటారు. ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లు, లెక్కింపు కోసం ఏర్పాటైన టేబుళ్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు మాత్రమే రౌండ్ల వారీగా ఈవీఎంలను బయటకు తీసుకువస్తాం. ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ర్యాండమ్గా ఎంపిక చేసిన అయిదు వీవీప్యాట్లలోని ఓటు పత్రాలను లెక్కిస్తాం. ఆయా ఈవీఎంలలోని ఓట్లు, వీవీప్యాట్లోని ఓటు పత్రాలు సమానంగా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఫలితాన్ని ప్రకటిస్తాం. వ్యత్యాసం వచ్చిన పక్షంలో వీవీప్యాట్లోని ఓట్లనే ప్రామాణికంగా తీసుకుని ఫలితాన్ని ప్రకటిస్తాం’ అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ ‘ఈనాడు’తో చెప్పారు.
ఫలితాల వేళ సైబర్ మాయలు.. జాగ్రత్త
దేశవ్యాప్తంగా ఎటుచూసినా ఎన్నికల ఫలితాలపై చర్చ. మంగళవారం కౌంటింగ్ సందర్భంగా ఉత్కంఠ నెలకొంది. దీన్ని అవకాశం చేసుకొని సైబర్ మాయగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఓట్ల లెక్కింపు వివరాల పేరిట ఈమెయిల్, మొబైల్ఫోన్లకు వచ్చే సందేశాలు నమ్మవద్దని సైబర్క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయటం ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకుఖాతా వివరాలు మాయగాళ్ల చేతికి చేరతాయని హెచ్చరిస్తున్నారు.
- రాష్ట్రంలో మొత్తం ఓటర్లు: 3,32,63,384
- ఓటు హక్కు వినియోగించుకుంది: 2,18,14,025
- పోస్టల్ బ్యాలెట్లు: సుమారు 2.18 లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు
ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు వైకాపా నేత కొడాలి నాని, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కేసు నమోదు చేశారు. -
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టారు. -
చంద్రబాబు నాయకుడు.. జగన్ ప్రతినాయకుడు
రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు దిల్లీ వెళితే.. హింసా రాజకీయాల్ని ప్రోత్సహించే వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్లారని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. -
అసెంబ్లీకి ఐదేళ్లలో సున్నం కూడా వేయలేదు
వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని నాశనం చేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరం కలసి మంచి రాజధానిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు హైదరాబాద్లో ఘనస్వాగతం
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. -
చిత్తూరులో వైకాపాకు భారీ షాక్
వైకాపాకు చిత్తూరులో భారీ షాక్ తగిలింది. నగర మేయర్ ఎస్.అముద ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
దర్శి వైకాపా ఎమ్మెల్యే హల్చల్
అధికార అండతో ఇన్నాళ్లూ దౌర్జన్యాలకు పాల్పడిన వైకాపా నాయకులు ఇప్పుడు కూడా అదే మార్గంలో వెళుతున్నారు. -
సొంత బాబాయ్ చనిపోయినా.. జగన్ ఇంతలా స్పందించలేదు
తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే పట్టించుకోని జగన్.. ఈవీఎం పగలగొట్టి, సీఐ హత్యకు యత్నించి జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో వెళ్లడం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. -
భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చితి ఏర్పడకుండా చూడాలి: సీపీఎం
రాజధాని అమరావతిపై భవిష్యత్తులో అనిశ్చితి, గందరగోళం ఏర్పడకుండా వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. -
ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
లోక్సభ హౌస్ కమిటీలో పురందేశ్వరికి చోటు
ఎంపీల వసతి, ఇతర సదుపాయాలను పర్యవేక్షించే లోక్సభ హౌస్ కమిటీ ఏర్పాటైంది. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్ శర్మ నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో 12 మంది సభ్యులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. -
పిన్నెల్లి వాసుల సమస్యపై కోర్టుకు వెళ్దాం
గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలప్పటి నుంచి పరిస్థితి కుదుటపడలేదని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్కు తెలిపారు. -
8న రాజమహేంద్రవరంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
రాజమహేంద్రవరంలో ఈ నెల 8న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు. -
ఓటమిపై కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు
మాజీ సీఎం, భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
భారాస అధికారిక సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. -
కేశవరావు రాజీనామాకు ఆమోదం
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చేసిన రాజీనామాను ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ శుక్రవారం ఆమోదించారు. -
తెలంగాణ దాటితే కేసీఆర్ను ఎవరూ గుర్తుపట్టరు
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో కూర్చొని ఆ పార్టీ శ్రేణులకు పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన స్పీకర్
ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే విషయమై దాదాపు నెల రోజులుగా పశ్చిమబెంగాల్ రాజ్భవన్, ఆ రాష్ట్ర శాసనసభ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో వివాదం తలెత్తింది. -
హాథ్రస్పై రాజకీయం చేయను
దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్ తొక్కిసలాటపై తాను రాజకీయాలు చేయదలచుకోవడం లేదని, కానీ తప్పు రాష్ట్ర అధికార యంత్రాంగానిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నెల రోజుల్లో మోదీ ప్రభుత్వ పతనం
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, నెల రోజుల్లోపే అది కుప్పకూలడం ఖాయమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ అన్నారు. -
మండలి హస్తగతమే లక్ష్యం
తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!