- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Lok Sabha Elections: ఎన్డీయే మురిపెమా.. ఇండియా విజయమా?
యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది! రాబోయే ఐదేళ్లపాటు దేశ పాలనా పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండబోతున్నాయో మరికొన్ని గంటల్లో తేలనుంది.
ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెర
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు
హ్యాట్రిక్ గెలుపుపై భాజపా గురి
ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామన్న ధీమాతో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు
ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
దిల్లీ
యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది! రాబోయే ఐదేళ్లపాటు దేశ పాలనా పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండబోతున్నాయో మరికొన్ని గంటల్లో తేలనుంది. 18వ లోక్సభ ఏర్పాటు కోసం మండుటెండల్లో రెండు నెలలకు పైగా సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా? లేదంటే కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్ష ఇండియా కూటమి మెజార్టీ సీట్లు దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందా? ఇవేమీ కాకుండా అనూహ్యంగా హంగ్ తలెత్తుతుందా? దేశమంతటా.. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర దేశాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇంకొన్ని గంటల్లోనే దొరకబోతున్నాయి. ఒక్కో ఈవీఎం కంట్రోల్ యూనిట్ తెరుచుకునేకొద్దీ అభ్యర్థుల జాతకాలు తేలబోతున్నాయి. దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన కనీస మెజార్టీ 272. గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 542 సీట్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ మంగళవారమే వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం (ఈసీ) పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల్లో ఘన విజయంతో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో జోస్యం చెప్పాయి. ‘చార్ సౌ పార్’ అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగిన కమలనాథులు.. ఆ మార్కుకు చేరువగా వెళ్తారని అంచనా వేశాయి. అదే జరిగితే- వరుసగా మూడు ఎన్నికల్లో సొంత పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమం చేస్తారు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళల్లో భాజపా ఎలాంటి ఫలితాలను దక్కించుకుంటుందనేది చాలామంది దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. తమిళనాడు, కేరళల్లో ప్రస్తుతం ఆ పార్టీకి సిటింగ్ ఎంపీలెవరూ లేరు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కమలదళం ఈసారి కచ్చితంగా బోణీ కొడుతుందని, బలమైన పక్షంగా అవతరిస్తుందని అంచనాలు జోరుగా వెలువడుతున్నాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను మించి కమలనాథులు సీట్లు గెల్చుకుంటారని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. తనకు కంచుకోటల్లాంటి ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భాజపా ఆధిపత్యాన్ని ఏ మేరకు కొనసాగిస్తుందనేది ఆసక్తికర ప్రశ్నగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే విజయం ఖాయమని.. అది ఎంతటి ఘన విజయం సాధిస్తుంది? కొత్తగా ఏయే స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుంది? అనే ప్రశ్నలే తేలాల్సి ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, భూపేందర్ యాదవ్, సర్బానంద సోనోవాల్, ధర్మేంద్ర ప్రధాన్ తదితర కేంద్ర మంత్రులతోపాటు మాజీ సీఎంలు శివరాజ్సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మై, త్రివేంద్రసింగ్ రావత్ భాజపా తరఫున ఈ ఎన్నికల బరిలో నిలిచారు.
ఆశల పల్లకిలో కాంగ్రెస్, మిత్రపక్షాలు
భాజపాను గద్దె దింపాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటుచేసుకున్నాయి. లక్ష్య సాధనలో ఆ కూటమి సఫలం కాబోదని, దాదాపుగా మూడింట ఒకవంతు సీట్లకే పరిమితమవుతుందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వాటి అంచనాలను విపక్ష నేతలు తోసిపుచ్చుతున్నారు. ‘ఇండియా’కు 295 సీట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ధీమాగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. అనేక రాష్ట్రాల్లో దారుణంగా చతికిలపడింది. ఈ దఫా అది ఎంతవరకు మెరుగైన ఫలితాలను సాధిస్తుందో చూడాలి. వామపక్షాలకు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం. ప్రస్తుతం ఒక్క కేరళలోనే బలమైన శక్తిగా లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. సార్వత్రిక సమరంలో మెరుగైన ఫలితాలు దక్కకపోతే దేశవ్యాప్తంగా వాటి మనుగడ మరింత కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి.
బరిలో 53 మంది మంత్రులు
53 మంది సిటింగ్ మంత్రులు ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. 17వ లోక్సభలో ఎంపీలుగా ఉన్నవారిలో 327 మంది మళ్లీ ఇప్పుడు పోటీ చేశారు. వారిలో 34 మంది పార్టీ మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 27% మంది ఇప్పటికే కనీసం ఒక్కసారైనా ఎంపీగా పనిచేసినవారే. సార్వత్రిక ఎన్నికలను ఏప్రిల్ 19 నుంచి ఈ నెల 1 వరకు ఏడు విడతల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.
సగటున ఒక్కో స్థానంలో 15 మంది
పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఎన్నికల్లో 8,360 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 16% మంది జాతీయ పార్టీల తరఫున, 6% మంది రాష్ట్ర పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. 47% మంది స్వతంత్రులు. అత్యధికంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 488 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో దించింది. తర్వాతి స్థానంలో భాజపా (441) నిలిచింది. కాంగ్రెస్ 328 చోట్ల పోటీ చేస్తోంది. సగటున ఒక్కో నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా తెలంగాణలో సగటున ఒక్కో స్థానంలో 31 మంది బరిలో నిలిచారు. లద్దాఖ్, నాగాలాండ్లలో ముగ్గురు చొప్పున మాత్రమే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని కరూర్లో అత్యధికంగా 54 మంది బరిలో ఉన్నారు. వారిలో 46 మంది స్వతంత్రులు.
పవార్, ఠాక్రేల భవితవ్యం ఏమయ్యేనో!
ఎన్సీపీ, శివసేన పార్టీల్లో చీలికల కారణంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల రాజకీయ భవితవ్యంపై ప్రస్తుతం ఒకింత నీలినీడలు కమ్ముకున్నాయి! పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ), ఠాక్రే నాయకత్వంలోని శివసేన (యూబీటీ) మహారాష్ట్రలో ఈ ఎన్నికల్లో సాధించే ఫలితాలే వారి భవిష్యత్ గమనాన్ని నిర్దేశిస్తాయనడంలో ఆశ్చర్యం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లకూ ఈ ఎన్నికలు కీలకమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఆయన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. -
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను గత ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. -
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస విద్యార్థి నేతల ఆందోళన.. పలువురి అరెస్టు
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస అనుబంధ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. రహదారిపై బైఠాయించి అనుబంధ విద్యార్థి సంఘం నేతలు నిరసన తెలిపారు. -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. -
ఆడిన మాట తప్పని రాజస్థాన్ మంత్రి కిరోడిలాల్
భాజపా సీనియర్ నేత, రాజస్థాన్ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి కిరోడి లాల్ మీనా (72) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆమోదించలేదు. -
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు
కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైనా కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్లో గురువారం కేసు నమోదుచేశారు. -
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల నిర్వాహకులేనని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. -
‘ఆమెను రాజమాత అని మీరెందుకు తిట్టారు? అక్కడి నుంచే పార్టీ నాశనం’
‘అంతా మీరే చేశారు’ ఇది ఒక సినిమాలోని పాపులర్ డైలాగు. ఇప్పుడదే డైలాగును వైకాపాలో తాజా మాజీలు ఒకరిపై ఒకరు గట్టిగానే ప్రయోగించుకున్నారు. -
భారాసకు భారీ షాక్
భారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. -
పిన్నెల్లి మంచోడు...
‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు.. కాబట్టే 2009 నుంచి 2019 వరకు నాలుగుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు ఆయన్ను దీవించారు. -
ప్రజాతీర్పునకు వక్రభాష్యాలా..?
ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా.. జగన్లో మార్పు రాలేదు. ప్రజాతీర్పును గౌరవించేందుకు ఆయన ఇంకా సిద్ధపడలేదు. ఓటమిని అంగీకరించక, రోజుకో మాట చెబుతూనే ఉన్నారు. -
ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం నేరాలు కావా?
పోలింగ్ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో భారీ విధ్వంసం సృష్టించి, ఈవీఎంలను ధ్వంసం చేసి, అడ్డుకోబోయిన సీఐపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకూడదా అని వైకాపా అధినేత జగన్ను తెదేపా నేతలు ప్రశ్నించారు. -
ముగ్గురాయి గనుల్లో అక్రమాలు.. ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల నష్టం
మంగంపేట ముగ్గురాయి గనుల్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఆరోపించారు. -
ప్రజాతీర్పు శిరోధార్యం
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, వారి తీర్పే శిరోధార్యమని, వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. -
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ విఫలం: కేటీఆర్
రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే రాహుల్ గాంధీ దాని స్ఫూర్తిని కాపాడడంలో విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా
భారాసను వీడి కాంగ్రెస్లో చేరిన కె.కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. -
సంక్షిప్త వార్తలు (5)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు ఈ నెల 6న భేటీ కావడం హర్షణీయమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు. -
ఫోన్ట్యాపింగ్తో సంబంధం లేదు: ఎమ్మెల్సీ నవీన్కుమార్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని భారాస ఎమ్మెల్సీ కె.నవీన్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించేందుకు ఎవరు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. -
10న తెలంగాణకు కాంగ్రెస్ కురియన్ కమిటీ
లోక్సభ ఎన్నికల్లో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించకపోవడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈ నెల 10న తెలంగాణకు రానుంది. -
అన్నీ గవర్నర్ చేతుల్లో ఉండవు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్ బిమన్ బెనర్జీ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
దిల్లీ, హరియాణాల్లో ఆప్తో పొత్తు లేనట్లే
త్వరలో శాసనసభ ఎన్నికలు జరగబోయే దిల్లీ, హరియాణాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కలిసి పోటీచేసే అవకాశం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లతో;
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
-
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
-
కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు భేటీ
-
నిద్ర సరిపోవట్లేదు.. రాత్రి 8 తర్వాత రాలేను: బైడెన్
-
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
-
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత