- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Lok Sabha Election: సింగిలా.. డబులా.. దక్కేవెన్ని?
హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల ఉత్కంఠకు తెర పడే సమయం ఆసన్నమైంది. పోలింగ్ ముగిసిన 21 రోజుల తర్వాత.. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుండడంతో ఫలితాలు తేటతెల్లం కానున్నాయి.
రెండంకెల సీట్లపైనే ప్రధాన పార్టీల దృష్టి
లోక్సభ ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ
ఈనాడు - హైదరాబాద్
ఓయూలో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని సనత్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది
హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల ఉత్కంఠకు తెర పడే సమయం ఆసన్నమైంది. పోలింగ్ ముగిసిన 21 రోజుల తర్వాత.. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుండడంతో ఫలితాలు తేటతెల్లం కానున్నాయి. పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా.. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలకు సవాల్గా నిలిచిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, పదేళ్లు పరిపాలించిన భారాసతో పాటు రాష్ట్రంలో బలపడే ప్రయత్నం చేస్తున్న భాజపాకూ ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. మూడు పార్టీలూ రెండంకెల స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో పోటీ పడ్డాయి. ఉన్నవి 17 సీట్లే కనుక.. రెండంకెల సీట్లు వస్తే, అది ఒక పార్టీకే పరిమితం. మూడింటిలోనూ ఏ పార్టీకైనా ఆ భాగ్యం దక్కనుందా? లేదా.. అన్ని పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లతోనే సరిపుచ్చుకోవాలా.. అనేది తేలిపోనుంది. శాసనసభ ఎన్నికల అనంతరం ఐదు నెలలకే జరిగిన లోక్సభ పోరులో సర్వశక్తులూ ఒడ్డిన ఈ మూడు ప్రధాన పార్టీలూ అత్యధిక స్థానాలను ఆశిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తానికి పట్టం కట్టిన ఓటర్లు ఈసారి కూడా మద్దతుగా నిలిచారని కాంగ్రెస్ ధీమాతో ఉంది. లోక్సభ ఎన్నికలు కావడంతో ప్రధానిగా మోదీ నాయకత్వానికే ప్రజలు ప్రాధాన్యమిచ్చి భాజపా వైపు మొగ్గు చూపారని ఆ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని, తమ ఓటుబ్యాంకు చెక్కుచెదరలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై నెలకొన్న అసంతృప్తి కలిసి వస్తుందని భారాస విశ్వాసంతో ఉంది.
అదృష్టవంతులెవరో..
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ లోక్సభ బరిలో సర్వశక్తులూ ఒడ్డింది. మెజారిటీ స్థానాలను ఆశిస్తూ భాజపా, భారాసలు కూడా పోటాపోటీగా ప్రచారాన్ని కొనసాగించాయి. గత నెల 13న జరిగిన పోలింగ్ సరళిని విశ్లేషించుకుని తాజాగా వచ్చిన ఎగ్జిట్పోల్ అంచనాలతో తమకు దక్కే స్థానాలపై ఓ అభిప్రాయానికి వచ్చిన ప్రధాన పార్టీలు.. ఓట్ల లెక్కింపులో వెలువడే అసలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్కు.. లోక్సభ ఎన్నికలు రెఫరండమే అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రచారంలో ప్రకటించారు. తమకు రెండంకెల స్థానాలు ఖాయమని భాజపా అగ్రనాయకులు పదే పదే చెప్పారు. అటు భారాస కూడా.. తమకు సిటింగ్ స్థానాలతో పాటు అదనపు సీట్లు ఖాయమన్న విశ్వాసంతో ఉంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీపడగా వీరిలో కాంగ్రెస్, భారాస, భాజపా ల అభ్యర్థులు 51 మందితో పాటు సీపీఎం, ఎంఐఎం అభ్యర్థులు ఒక్కోచోట బరిలో ఉన్నారు. ప్రస్తుతం భారాసకు తొమ్మిది సిటింగ్ స్థానాలుండగా.. భాజపాకు నాలుగు, కాంగ్రెస్కు మూడు, ఎంఐఎంకు ఒక సిటింగ్ స్థానం ఉన్నాయి.
అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ముఖ్యనేతలు
లోక్సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నవారిలో పలువురు కీలకనేతలు ఉన్నారు. కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మరో కీలకనేత ఈటల రాజేందర్ తదితరులు బరిలో ఉన్నారు. మారిన సమీకరణాల నేపథ్యంలో భారాస సిటింగ్ ఎంపీ రంజిత్రెడ్డి.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవగా.. మరో భారాస ఎంపీ బీబీ పాటిల్ భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు.గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ఈసారి భాజపా తరఫున బరిలో దిగారు. హైదరాబాద్ నుంచి వరుసగా గెలుస్తున్న ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి బరిలో నిలిచారు.
జాతీయ నాయకత్వాల ప్రత్యేక దృష్టి
రాష్ట్రం నుంచి మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్ల జాతీయ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా.. గతంలో కంటే విస్తృతంగా తెలంగాణలో ప్రచారం చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఆఖరి రోజు ప్రచారం దాకా కూడా భాజపా అగ్రనేతలు, జాతీయ నాయకత్వం, ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు ప్రచారంలో భాగస్వాములయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా.. రాష్ట్ర మంత్రులు, కీలక నాయకులకు ఒక్కో లోక్సభ స్థానం బాధ్యతలు అప్పగించారు. భారాస తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో బస్సుయాత్ర ద్వారా విస్తృత ప్రచారం చేయగా.. కేటీఆర్, హరీశ్రావు కూడా పలు నియోజకవర్గాల్లో ప్రచారసభలు, రోడ్షోలు నిర్వహించారు.
కీలక నియోజకవర్గాలపై అందరి దృష్టి
రాష్ట్రంలోని పలు లోక్సభ నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు సాగింది. దేశంలోనే అతి పెద్ద లోక్సభ స్థానమైన మల్కాజిగిరి మూడు పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలోనూ విజయం సాధించిన భారాస, గత లోక్సభ ఎన్నికల్లో రేవంత్రెడ్డి అభ్యర్థిగా ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్, ఈసారి తమ పార్టీ కీలకనేత ఈటల రాజేందర్ను బరిలో దించిన భాజపా.. ఇలా మూడు పార్టీలూ మల్కాజిగిరిని చేజిక్కించుకునేందుకు హోరాహోరీ పోరాడాయి. కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్లో ఆయనపై సిటింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, టి.పద్మారావు పోటీ చేశారు. భారాసకు బలమైన స్థానం మెదక్లో పోరు అత్యంత ఆసక్తికరంగా జరగడంతో ఈ ఫలితంపైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 17 లోక్సభ స్థానాల్లో పలు చోట్ల ముఖాముఖి పోటీ జరగ్గా.. మరికొన్ని స్థానాల్లో ముక్కోణపు పోరు సాగింది. ఈ నేపథ్యంలో గెలుపు తమదంటే తమదే అనే ధీమాతో పార్టీలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు నాయకుడు.. జగన్ ప్రతినాయకుడు
రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు దిల్లీ వెళితే.. హింసా రాజకీయాల్ని ప్రోత్సహించే వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్లారని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. -
అసెంబ్లీకి ఐదేళ్లలో సున్నం కూడా వేయలేదు
వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని నాశనం చేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరం కలసి మంచి రాజధానిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు హైదరాబాద్లో ఘనస్వాగతం
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. -
చిత్తూరులో వైకాపాకు భారీ షాక్
వైకాపాకు చిత్తూరులో భారీ షాక్ తగిలింది. నగర మేయర్ ఎస్.అముద ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
దర్శి వైకాపా ఎమ్మెల్యే హల్చల్
అధికార అండతో ఇన్నాళ్లూ దౌర్జన్యాలకు పాల్పడిన వైకాపా నాయకులు ఇప్పుడు కూడా అదే మార్గంలో వెళుతున్నారు. -
సొంత బాబాయ్ చనిపోయినా.. జగన్ ఇంతలా స్పందించలేదు
తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే పట్టించుకోని జగన్.. ఈవీఎం పగలగొట్టి, సీఐ హత్యకు యత్నించి జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో వెళ్లడం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. -
భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చితి ఏర్పడకుండా చూడాలి: సీపీఎం
రాజధాని అమరావతిపై భవిష్యత్తులో అనిశ్చితి, గందరగోళం ఏర్పడకుండా వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. -
ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
లోక్సభ హౌస్ కమిటీలో పురందేశ్వరికి చోటు
ఎంపీల వసతి, ఇతర సదుపాయాలను పర్యవేక్షించే లోక్సభ హౌస్ కమిటీ ఏర్పాటైంది. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్ శర్మ నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో 12 మంది సభ్యులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. -
పిన్నెల్లి వాసుల సమస్యపై కోర్టుకు వెళ్దాం
గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలప్పటి నుంచి పరిస్థితి కుదుటపడలేదని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్కు తెలిపారు. -
8న రాజమహేంద్రవరంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
రాజమహేంద్రవరంలో ఈ నెల 8న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు. -
ఓటమిపై కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు
మాజీ సీఎం, భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
భారాస అధికారిక సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. -
కేశవరావు రాజీనామాకు ఆమోదం
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చేసిన రాజీనామాను ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ శుక్రవారం ఆమోదించారు. -
తెలంగాణ దాటితే కేసీఆర్ను ఎవరూ గుర్తుపట్టరు
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో కూర్చొని ఆ పార్టీ శ్రేణులకు పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన స్పీకర్
ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే విషయమై దాదాపు నెల రోజులుగా పశ్చిమబెంగాల్ రాజ్భవన్, ఆ రాష్ట్ర శాసనసభ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో వివాదం తలెత్తింది. -
హాథ్రస్పై రాజకీయం చేయను
దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్ తొక్కిసలాటపై తాను రాజకీయాలు చేయదలచుకోవడం లేదని, కానీ తప్పు రాష్ట్ర అధికార యంత్రాంగానిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నెల రోజుల్లో మోదీ ప్రభుత్వ పతనం
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, నెల రోజుల్లోపే అది కుప్పకూలడం ఖాయమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ అన్నారు. -
మండలి హస్తగతమే లక్ష్యం
తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దు
గద్వాల భారాస ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం గాంధీభవన్లో ఆందోళనకు దిగారు. -
పవన్కల్యాణ్ వల్లే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం: జగ్గారెడ్డి
జనసేన అధినేత పవన్కల్యాణ్ తెదేపాతో భాజపాకు పొత్తు కుదర్చకపోతే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చేది కాదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
-
గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది అధికారులు
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
-
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
-
మిర్యాలగూడ స్టేషన్లో నిలిచిన ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలు