Malkajigiri: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి నిరసన సెగ

మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది.

Published : 04 Jul 2024 19:27 IST

మల్కాజిగిరి: మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో కొన్ని నెలలుగా మెయిన్‌ రోడ్‌ మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేశారని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ఎదుట ఆగ్రహం వ్యక్తంచేశారు. పలుమార్లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినా ఫలితం లేదని ఆందోళనకు దిగారు. 

ఈ క్రమంలో ఎమ్మెల్యేని నిలదీసిన వారిపై మరో వర్గం దాడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని