Jeevan Reddy: కాళేశ్వరానికి కేంద్ర అనుమతులు లేవు: జీవన్‌ రెడ్డి

కాళేశ్వరానికి కేంద్ర జలమండలి అనుమతులు లేవని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

Published : 24 Oct 2023 11:52 IST

రాయికల్‌: కాళేశ్వరానికి కేంద్ర జలమండలి అనుమతులు లేవని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై జీవన్‌రెడ్డి స్పందించారు. ‘‘ప్రాజెక్టు కట్టిన నాలుగేళ్లలో కాళేశ్వరం తూములు కొట్టుకుపోతాయా? 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ కట్టిన నాగార్జునసాగర్‌, ఎస్‌ఆర్‌ఎస్పీ చెక్కు చెదరలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలి’’ అని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని