- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Balashowry: విభజన చట్టం హామీ ప్రకారం అమరావతికి సాయం చేయండి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం సాయం చేయాలని జనసేన లోక్సభాపక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు.
లోక్సభలో బాలశౌరి డిమాండ్
ప్రధాని మోదీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న బాలశౌరి
ఈనాడు, దిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం సాయం చేయాలని జనసేన లోక్సభాపక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. దేశంలో రాజధాని లేని ఏకకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని, ఇప్పటివరకు కేంద్రం దీని నిర్మాణం కోసం రూ.1,500 కోట్లు మాత్రమే ఇచ్చిందని, ఇది ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు. అందువల్ల విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు పూర్తిసాయం అందించాలని విన్నవించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఎప్పటికప్పుడు నిధులు మంజూరుచేస్తూ పోవాలని కోరారు. జల్జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందించే పథకానికి ఇదివరకటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోడంవల్ల ఆ పథకం స్తంభించిపోయిందన్నారు. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కరుణించి మచిలీపట్నం నియోకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు కొళాయి నీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముడిచమురు రిఫైనరీ ఏర్పాటుచేస్తామని విభజన చట్టంలో చెప్పినందున దాని ప్రకారం మచిలీపట్నంలో నెలకొల్పాలని కోరారు. మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు కొత్త రైల్వేలైన్ నిర్మాణం పూర్తిచేయాలని విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోదీ మద్దతు ఇస్తే సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ల నాయకత్వంలో అది పూర్వవైభవం సంతరించుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త చట్టం కింద భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. -
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 4న (గురువారం) నెల్లూరుకు వెళ్లనున్నారు. అక్కడి కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు. -
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి 7.25 గంటలకు దిల్లీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. -
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
కేసీఆర్తో భారాసకు చెందిన జడ్పీ ఛైర్పర్సన్లఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ భారాసకే ప్రజలు పట్టం కడతారని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసింది. -
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
కాకినాడ నగరపాలకసంస్థ పరిధిలో వైకాపా నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన అనుచరులతో కలసి అడ్డుకున్నారు. -
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
వైకాపా ప్రభుత్వ అనారోగ్య ఆర్థిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా పార్లమెంటరీ పార్టీ ఉపనాయకురాలు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. -
వైకాపా నాయకులు కబళించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి
గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు, ఇతరులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని, కబళించిన భూముల్ని రెవెన్యూ రికవరీ చట్టం లేదా ఇతర చట్టాల్ని ప్రయోగించి స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ ఆర్థిక మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. -
పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ: తెదేపా నేత కేఎస్ జవహర్
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసి సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెదేపా సీనియర్ నేత కేఎస్ జవహర్ కొనియాడారు. -
సంక్షిప్త వార్తలు (5)
పదేళ్లు అధికారంలో ఉండి జాబ్ క్యాలెండర్ ఎందుకివ్వలేదని భారాస నాయకులను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. నిరుద్యోగులు సమయం వృథా చేసుకోకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. -
రాహుల్ది పిల్లచేష్ట
లోక్సభ విపక్ష నేత రాహుల్గాంధీది పిల్లచేష్ట (బాలక్ బుద్ధి) అని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. వరసగా మూడు లోక్సభ ఎన్నికల్లో వంద సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కు ఇదే తొలిసారి అని చెప్పారు. -
రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన కేసీఆర్
రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. 2018 ఎన్నికల సమయంలో భారాస మ్యానిఫెస్టోలో మాఫీ హామీ ఇచ్చి 2023 ఎన్నికల ముందుదాకా కేసీఆర్ మొద్దు నిద్ర పోయారని ఆయన మీడియాకు తెలిపారు. -
పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడు నెలల పాలనలో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, వేతనాలు లేక పారిశుద్ధ్య కార్మికులు అల్లాడుతున్నారని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు ధ్వజమెత్తారు. -
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థుల నామినేషన్లు
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ మంగళవారం నామినేషన్లు సమర్పించారు. -
వైఎస్ జయంతి వేడుకలకు సోనియా, రాహుల్గాంధీ
విజయవాడలో ఈ నెల 8న నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియాగాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర ఏఐసీసీ పెద్దలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు హాజరవుతున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. -
హనుమకొండ భారాస కార్యాలయానికి నోటీసులు
హనుమకొండ బాలసముద్రంలో ఉన్న భారాస కార్యాలయానికి వరంగల్ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీచేసింది. పార్టీ కార్యాలయానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారని... -
తెలంగాణ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి
తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే సమగ్ర సమాచారాన్ని గత ప్రభుత్వం రూపొందించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రాహుల్లా ప్రవర్తించకండి
లోక్సభలో స్పీకర్ స్థానాన్ని అవమానించేలా ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ మాట్లాడి అమర్యాదకరంగా ప్రవర్తించారని, ఎన్డీయే సభ్యులెవరూ అలా చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. -
యూపీలో మాకు 80 సీట్లు వచ్చినా.. ఈవీఎంలను విశ్వసించం
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో విపక్ష నేతలు మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. -
ఖర్గే స్థానంలో జైరాం ఉంటే బాగుండేది
-
నా వ్యాఖ్యల తొలగింపు అప్రజాస్వామికం
రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్సభలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడాన్ని నిరసిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం లేఖ రాశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
-
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
కొత్త చట్టం కింద భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు