- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu-Lokesh: 1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
గతంలో పరదాల సీఎంను మనం చూశామని.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు
మంగళగిరి: గతంలో పరదాల సీఎంను మనం చూశామని.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(Chandrababu)తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్, చంద్రబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది.
అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైమ్ పడుతుందనుకుంటా సర్.. ఇంకా పరదాలు కడుతున్నారు అని లోకేశ్ అనగానే.. లేదు సెట్ అయ్యారని చంద్రబాబు బదులిచ్చారు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం మానుకోలేదని.. బతిమిలాడి తీయిస్తున్నామని లోకేశ్ చెప్పారు. మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టినవారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని సీఎం అన్నారు.
‘‘ఎవరైనా సరే పాత రోజులు మరిచిపోవాలి. ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవు. రివర్స్ పోయే బండిని పాజిటివ్ వైపు నడిపిస్తున్నాం. స్పీడ్ పెంచడం తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి ఎవరికీ ఉండకూడదు. ఆ ఆలోచనే రాకూడదు. అలా ఉండకపోతే ఒక్క షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు. దానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రారంభం కాబట్టి స్లోగా వెళ్తున్నా.. ఇక స్పీడ్ పెంచాలి. ఈ ప్రభుత్వంలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. చరిత్ర గుర్తు పెట్టుకోవాలి. నువ్వు కూడా అప్పట్లో కుర్రాడివి. నీకు కూడా ఐడియా లేదు. అప్పట్లో హైదరాబాద్ నుంచి బయల్దేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. ఇప్పుడు అంతలా ఉండదు కానీ.. తప్పు చేస్తే మాత్రం ఎవర్నీ వదిలిపెట్టను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి’’అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం, మంత్రి లోకేశ్ మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో సభలో నవ్వులు పూశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీకి సీఎం చంద్రబాబు.. బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రధానితో చర్చించే అవకాశం
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం దిల్లీకి వెళ్లనున్నారు. -
ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ లేఖ
NEET Row| కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి.. పాలనలో మార్పు కనిపించాలి: చంద్రబాబు
ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహించారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి ఏర్పాట్లు
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. -
కేంద్రం నిధులను వైకాపా పక్కదారి పట్టించింది: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. -
శారదా పీఠానికి కేటాయించిన ఆ 15 ఎకరాలు రద్దు చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
శారద పీఠానికి వైకాపా ప్రభుత్వం కొత్తవలసలో కేటాయించిన 15 ఎకరాలకు పైగా భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కోరారు. -
రెవెన్యూ రికవరీ యాక్ట్తో ‘వైకాపా’ అక్రమార్జనను రాబట్టాలి: చంద్రబాబుకు యనమల లేఖ
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. -
కాకినాడ కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. -
నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్
ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దానిని విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
పిన్నెల్లితో మాజీ మంత్రుల ములాఖత్
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, పలువురు కుటుంబ సభ్యులు సోమవారం పరామర్శించారు. -
ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి: లోక్సభలో తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 90% సీట్లు.. 56% ఓట్లతో ఎన్డీయే కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
నల్గొండలోని భారాస కార్యాలయాన్ని కూల్చేయండి
నల్గొండలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారాస జిల్లా కార్యాలయాన్ని నిర్మించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
నేను అందరివాడిని
ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచించి అందరికీ న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను అందరివాడినే తప్ప ఏ ఒక్కరివాణ్నీ కాదని స్పష్టం చేశారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులను సోమవారం ఖరారు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
విభజన చట్టం హామీ ప్రకారం అమరావతికి సాయం చేయండి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం సాయం చేయాలని జనసేన లోక్సభాపక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. -
అగ్నివీరులపై రాహుల్గాంధీ అసత్య ప్రచారాలు
అగ్నివీరులు విధి నిర్వహణలో మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ముపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ధ్వజమెత్తారు. -
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. 9 మందితో కూడిన ప్యానెల్ స్పీకర్ల జాబితాను సోమవారం ప్రకటించారు. వారిలో బాపట్ల తెదేపా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కూడా ఉన్నారు. -
తప్పులన్నీ బయటకు తీస్తాం..
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని భయపెట్టారని.. కానీ ఎక్కడా అలా జరగలేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
పరువు నష్టం కేసులో టీఎంసీ ఎంపీకి రూ.50 లక్షల జరిమానా
పరువు నష్టం కేసులో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ దౌత్యవేత్తకు రూ.50లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. -
ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు: ఖర్గే
పార్లమెంటులో ఎంపీలను సస్పెండ్ చేయటం ద్వారా కొత్త నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. -
కోట్ల మంది హిందువులను అవమానించారు
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ఇంటా బయటా భాజపా ధ్వజమెత్తింది. హిందువులంతా హింసాత్మక వాదులంటూ ఆయన కోట్ల మందిని అవమానపరిచారని విమర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి సీఎం చంద్రబాబు.. బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రధానితో చర్చించే అవకాశం
-
గూగుల్ మ్యాప్స్ను నమ్మి.. దట్టమైన అడవిలో 11 గంటలు చిక్కుకొని..
-
పేపర్ లీక్లను తీవ్రంగా పరిగణిస్తున్నాం - ప్రధాని మోదీ
-
ఆస్పత్రిలో భారత మాజీ హెడ్ కోచ్.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు
-
50 జంటలకు సామూహిక వివాహాలు.. భారీ కానుకలు అందజేసిన అంబానీ కుటుంబం
-
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 87కి చేరిన మృతుల సంఖ్య