TG News: శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోం!

రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా ఐదారుగురికి చోటు దక్కొచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు.

Published : 02 Jul 2024 05:26 IST

ఇష్టాగోష్ఠిలో మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్‌:  రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా ఐదారుగురికి చోటు దక్కొచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. సోమవారం మంత్రుల సముదాయంలోని తన నివాసంలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘మంత్రివర్గంలో ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన ఒకరికి, రెడ్డి సామాజికవర్గానికి చెందిన మరొకరికి అవకాశం ఉండొచ్చు. నిజామాబాద్‌ నుంచి ఒకరికి పదవి దక్కొచ్చు. శాఖల్లో మార్పులు జరిగితే మంత్రి సీతక్కకు హోం శాఖ ఇవ్వొచ్చు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, దానం నాగేందర్‌కు మంత్రి పదవులు వచ్చే అవకాశముంది. రాజగోపాల్‌రెడ్డికి అధిష్ఠానం ఇప్పటికే హామీ ఇచ్చింది’’ అని మంత్రి తన అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు ఉంటాయని సీఎం అన్న వ్యాఖ్యలను ప్రస్తావించగా... రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాల్లో మార్పులు ఉంటాయని దామోదర్‌ స్పందించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని