- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Narendra modi: నా మిత్రుడు చంద్రబాబుతో కలిసి పని చేస్తా: మోదీ
ప్రధాని మోదీని తెదేపా ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని పలకరించి మాట్లాడారు.
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారం దిల్లీలో తెదేపా ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అప్యాయంగా పలకరించి మాట్లాడారు. రాబోయే అయిదేళ్లూ రాష్ట్రంలో, కేంద్రంలో తెదేపా, భాజపా కలిసి పని చేస్తాయని చెప్పారు. నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పని చేస్తామని ప్రధాని అన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం.. తప్పుచేసిన ఎవరినీ వదలం: మంత్రి నాదెండ్ల
మంత్రి నాదెండ్ల మనోహర్ ముమ్మిడివరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 10 రైస్ మిల్లులు, గోదాముల్లో శుక్రవారం తనిఖీలు చేసిన ఆయన.. రైస్ మిల్లుల వెనుక వైకాపా నేత ద్వారంపూడి అనుచరులు ఉన్నారన్నారు. -
పార్టీని వీడే వారి గురించి ఆలోచించొద్దు: కేసీఆర్
పార్టీని వీడి దొంగల్లో కలసినవారి గురించి బాధలేదని.. అంతకన్నా మెరుగైన, మెరకల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. -
ఒక సీఎంకు 986 మందితో భద్రతా?: చంద్రబాబు ఆశ్చర్యం
రాజకీయ నేరస్థులకు రాష్ట్రంలో ఎక్కువ భద్రత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. -
రైతులు, ఉద్యోగుల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటా: సోమిరెడ్డి
కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టును తరలిపోనివ్వబోమని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కంటైనర్ పోర్టు తరలింపుతో పది వేల మంది ఉపాధి కోల్పోతారన్నారు. -
పోలవరాన్ని చూస్తే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి: సీఎం చంద్రబాబు
పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన.. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. -
పిన్నెల్లి నేర సామ్రాజ్యాన్ని పెకిలించాలి: ప్రత్తిపాటి పుల్లారావు
రౌడీమూకలకు ఇకపై గడ్డు రోజులేనని తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. -
భారాసకు మరో షాక్.. కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే
భారత రాష్ట్ర సమితి (భారాస)కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తా: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. -
జగన్.. అలాంటి ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదు: గంటా శ్రీనివాసరావు
ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ప్రతిష్ఠను జగన్ దిగజార్చారని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. -
కాకినాడ పోర్టు అడ్డాగా ద్వారంపూడి ఫ్యామిలీ రాజ్యమేలింది: మంత్రి నాదెండ్ల
జగన్ సర్కారు హయాంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కుటుంబం కోసం యావత్ ప్రభుత్వ శాఖలన్నీ పనిచేశాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. -
మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
మళ్లీ అధికారంలోకి వస్తామని భారాస అధినేత కేసీఆర్ పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్కు చెందిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. -
జగన్ తప్పులు చేయడంతోనే ప్రజలు శిక్షించారు
‘‘ప్రజలు...అధికారాన్ని మనకు సొంత పగలు తీర్చుకోవడానికి ఇవ్వరని జగన్ని చూసి నేర్చుకోవాలి. 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ చేసిన పనులు తప్పని నిరూపించడానికే మొన్న ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. -
రాజ్యసభాపక్ష నేతగా జె.పి.నడ్డా నియామకం
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా గురువారం రాజ్యసభాపక్ష నేతగా నియమితులయ్యారు. ఎగువసభ 264వ సెషన్ ప్రారంభమైన తొలి రోజున ఈ నియామకం విషయాన్ని ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. -
సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో 6న దేశవ్యాప్త నిరసనలు
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్నారని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ప్రదీప్సింగ్ ఠాకూర్ విమర్శించారు. -
పిట్రోడాను మళ్లీ తీసుకొస్తారని మోదీ ఆనాడే చెప్పారు
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్ నేత శాం పిట్రోడాకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్గా మళ్లీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. -
మోదీపైనే సంసద్ టీవీ ఫోకస్: కాంగ్రెస్
పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని మోదీని ఎక్కువ సార్లు ‘సంసద్ టీవీ’లో చూపించారంటూ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది. -
బీఎస్పీ అభ్యర్థికి శిరోమణి అకాలీదళ్ మద్దతు
పంజాబ్లోని జలంధర్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జులై 10న జరగనున్న ఉప ఎన్నికలో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) నేతలు వెల్లడించారు. -
పుంగనూరులో పెద్దిరెడ్డికి షాక్
వైకాపా కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గం పుంగనూరులో భారీ షాక్ తగిలింది. -
భారాస, భాజపా కుమ్మక్కయ్యాయనడం విడ్డూరం: హరీశ్రావు
పార్లమెంటు ఎన్నికల్లో భారాస, భాజపా కుమ్మక్కయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఇకపై లిఫ్ట్లోనే రహస్య సమావేశాలు
మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులు, మాజీ ముఖ్యమంత్రులు ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడణవీస్లు విధాన భవన్లో గురువారం ఒకరికొకరు ఎదురుపడ్డారు. -
సింగరేణి గనుల వేలానికి వ్యతిరేకంగా ఆందోళనలు
తెలంగాణ గడ్డపై ఉన్న ప్రతి బొగ్గుపెళ్ల సింగరేణికే దక్కుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత రాజిరెడ్డి అన్నారు. సింగరేణిని కాదని రాష్ట్రంలోని గనులను వేలం వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తొలి డిబేట్లో దూకుడు.. ‘ట్రంప్ మీడియా’ షేర్లు పైపైకి!
-
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
-
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
రాజ్యసభలో గరం గరం.. ఖర్గే, ధన్ఖడ్ మధ్య మాటల యుద్ధం
-
బంజారాహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన డీజేలు
-
ఆ దూషణలు నన్నెంతో బాధించాయి - రిషి సునాక్