GHMC: భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని నిరసన తెలిపారు. దీంతో భారాస కార్పొరేటర్లపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులను భారాసనే ప్రోత్సహించిందని మేయర్ వ్యాఖ్యానించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సమావేశాన్ని కాసేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
దాడి చేసుకున్న కార్పొరేటర్లు
కాంగ్రెస్, భాజపా కార్పొరేటర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. భాజపా కార్పొరేటర్ శ్రవణ్పై కాంగ్రస్ కార్పొరేటర్లు దాడి చేశారు. ప్లకార్డుల విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదం రేగింది. దీంతో మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాన్ని మళ్లీ వాయిదా వేశారు. తర్వాత మళ్లీ సమావేశం తర్వాత.. వాటర్ వర్క్స్ ఎండీని కౌన్సిల్కు తీసుకురావాలని కార్పొరేటర్లు పట్టుపట్టారు. అనారోగ్యం కారణంగా ఎండీ అశోక్ రెడ్డి సమావేశానికి రాలేదు. వెంటనే ఆయన్ను పలిపించాలని కమిషనర్ను మేయర్ ఆదేశించారు. అశోక్ రెడ్డితో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఫోన్లో మాట్లాడారు. జలమండలి పనితీరుపై భారాస, భాజపా కార్పొరేటర్లు నిరసన చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరికలు
-
ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు
నిరుద్యోగులను తప్పుదోవ పట్టించి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని భారాస నేతలు చూస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ కారణం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ కారణమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. -
హామీల అమలులో రాష్ట్ర సర్కారు విఫలం: కిషన్రెడ్డి
మహిళలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆరోపించారు. -
రాజ్యాంగానికి రాహుల్ తూట్లు
‘‘ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్ నాయకులు మంగళం పాడి.. మా ఆరుగురు ఎమ్మెల్సీలను, ఏడుగురు ఎమ్మెల్యేలను వాళ్ల పార్టీలో చేర్చుకున్నారు. ఈ విషయంలో రేవంత్రెడ్డి పాత్రధారి.. రాహుల్ గాంధీ సూత్రధారి. -
డీఎస్సీ అభ్యర్థులను దగా చేస్తారా?
డీఎస్సీ వాయిదా వేయాలని, పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్లండి
లోక్సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో భాజపాను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి పదాధికారులకు సూచించారు. -
యువతను నిరుద్యోగులుగా ఉంచడమే మోదీ లక్ష్యం
దేశంలోని యువతను నిరుద్యోగులుగా ఉంచడమే ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/07/24)
-
బెడ్పై నేహాశెట్టి పోజులు.. ఎల్లో శారీలో జాన్వీ.. మీనాక్షి కొత్త లుక్!
-
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
-
కోల్డ్వార్ వేళ.. రష్యాను ఓ ఊపుఊపిన బాలీవుడ్ సాంగ్!
-
మెరిసిన రాధికా మర్చెంట్.. హల్దీ వేడుకల ఫొటోలు వైరల్