తెదేపా నాయకులపై పెప్పర్ స్ప్రేతో వైకాపా నేత దాడి
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా, ఓటమి అక్కసుతో వైకాపా నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఘటన
నల్లజర్ల, న్యూస్టుడే: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా, ఓటమి అక్కసుతో వైకాపా నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన తెదేపా నాయకులు గురుమిల్లి వెంకట సూర్యనారాయణ, చింతా గణేశ్ శనివారం గ్రామంలోని తాగునీటి ట్యాంకు వద్ద ఉండగా.. వైకాపా కార్యకర్త యెర్నిని సన్యాసిరావు అటుగా వచ్చారు. తెదేపా విజయాన్ని ప్రస్తావిస్తూ సూర్యనారాయణతో గొడవపడ్డారు. దుర్భాషలాడి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సూర్యనారాయణ కులపెద్ద విప్పల వీరరాఘవకు ఫిర్యాదు చేయగా, ఆయన ఇరువర్గాలను పిలిచి పంచాయితీ పెట్టారు. అక్కడా మాటామాటా పెరిగి సన్యాసిరావు తనవెంట తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేను సూర్యనారాయణ, గణేశ్ల కళ్లలో కొట్టి పరారయ్యారు. స్థానికులు బాధితులను తొలుత 108 వాహనంలో నల్లజర్ల ప్రభుత్వాసుపత్రికి, అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని స్థానిక తెదేపా నాయకులు పరామర్శించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలోనే ‘విశాఖ ఫైల్స్’ విడుదల: మాజీ మంత్రి గంటా
విశాఖ నగరంలో వైకాపా భూదందాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. -
అభివృద్ధిపై పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్ తోనూ చర్చిస్తాం: బండి సంజయ్
తన జన్మభూమి అయిన కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. -
తెదేపా నేత అన్నే రామకృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది: సీఎం చంద్రబాబు
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెదేపా నేత అన్నే రామకృష్ణ మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు. -
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు
వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజు.. అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరుతూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నా ఫోన్లో స్పైవేర్: కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు తన మొబైల్ ఫోనును లక్ష్యంగా చేసుకుని స్పైవేర్తో గురిపెట్టిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఆరోపించారు. -
అన్యాయంపై పోరాటంలో.. అలుపెరగని రఘురామ
పోలీసు కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేసిన వారిపై మూడేళ్లుగా న్యాయపోరాటం సాగిస్తున్న తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీరు.. రాజకీయ, పోలీసు, న్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది. -
శిలాఫలకాలపై జగన్ చిత్రం తొలగించాలి
ప్రభుత్వం మారి నెలరోజులైనా, పథకాల పేర్లు మార్చినా అధికారుల్లో మార్పు రాలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. -
18 నుంచి జనసేన సభ్యత్వ నమోదు
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జులై 18 నుంచి 28 వరకు నిర్వహించాలని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. -
వైకాపా కబ్జాదారుల నుంచి రక్షించండి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ సమస్యల్ని విన్నవించుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వారితో తెదేపా కార్యాలయం శనివారం కిక్కిరిసింది. -
కార్యకర్తలపై అక్రమ కేసుల్ని తొలగిస్తాం
వైకాపా ప్రభుత్వ హయాంలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల నుంచి ఏడాదిలోగా తొలగిస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలి
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిలిపివేసేందుకు సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని ఒప్పించాలని, తెదేపా ప్రకటించిన ‘సూపర్ 6’ హామీలను సత్వరమే అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర విస్తృత సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. -
తోకపార్టీ అనడం వైకాపా అవగాహన రాహిత్యం
పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు.. వైకాపా నేతల తీరు ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. -
కులాల్ని రెచ్చగొట్టి... రక్షణ పొందాలనుకుంటే కుదరదు
తనపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడైన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్పై కేసు పెట్టడాన్ని కులాల సమస్యగా చిత్రీకరించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఉండి ఎమ్మెల్యే, తెదేపా నేత రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. -
అక్రమ కేసుల్లోంచి చట్టప్రకారం విముక్తి కలిగిద్దాం
అధికారంలోకి వచ్చేశామనే అలసత్వం వద్దని, మరో పది, పదిహేనేళ్ల పాటు పార్టీ అధికారంలో ఉండేలా ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. -
ఉప ఎన్నికల్లో ‘ఇండియా’ విజయం
దేశంలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 13 శాసనసభ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో విపక్షాలు ఘన విజయం సాధించాయి. -
మూడు నాలుగేళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాం
గత మూడు, నాలుగేళ్లలో దేశంలో 8 కోట్ల ఉద్యోగాల కల్పన జరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం ఆయన ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో రూ.29 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్వి పగటి కలలు: ఎంపీ చామల
తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పగటి కలలు కంటున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. -
ఐదేళ్ల తర్వాత మళ్లీ భారాసదే అధికారం
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఐదేళ్ల తర్వాత బ్రహ్మాండమైన మెజారిటీతో భారాస మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
కాంగ్రెస్లో చేరేందుకు భారాస ఎమ్మెల్యేలు బారులు తీరుతున్నారు. శనివారం ఆ పార్టీకి చెందిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ హైదరాబాద్.. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వచ్చి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. -
పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ?
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో జవాబుదారీతనం లేదని భాజపా శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలోని భాజపా శాసనసభాపక్షకార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
1న వేతనాల చెల్లింపు.. ప్రకటనలకే పరిమితం
తెలంగాణలోని ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామనే రాష్ట్ర ప్రభుత్వ మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వింబుల్డన్ ఫైనల్లో జకోవిచ్ vs అల్కరాస్.. కనివినీ ఎరుగని రీతిలో టికెట్ల ధరలు
-
‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
-
ట్రంప్పై కాల్పులు.. భారీగా పెరిగిన విజయావకాశాలు..!
-
తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. దేశవ్యాప్తంగా ఆసక్తి!
-
త్వరలోనే ‘విశాఖ ఫైల్స్’ విడుదల: మాజీ మంత్రి గంటా
-
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!