- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు (5)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు ఈ నెల 6న భేటీ కావడం హర్షణీయమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు.
హైదరాబాద్లోని ఆస్తులు తెలంగాణకే చెందాలి
మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి
హైదరాబాద్, న్యూస్టుడే: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు ఈ నెల 6న భేటీ కావడం హర్షణీయమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ఆస్తుల పంపకాలపై చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. ప్రధానంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఈ సమస్యపై సమగ్రంగా చర్చించి సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. కృష్ణా బేసిన్ సమస్య పరిష్కరించకుండా పెన్నా బేసిన్ని తీసుకువెళ్తామని ఏపీ అనడం సరికాదన్నారు. హైదరాబాద్లో ఉన్న ఆస్తులన్నీ తెలంగాణకే చెందాలని అభిప్రాయపడ్డారు.
తెజసలో చేరిన ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ గురువారం తెజసలో చేరారు. హైదరాబాద్లోని తెజస ప్రధాన కార్యాలయంలో ఆచార్య కోదండరాం ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారని శ్రీనివాస్ ఆరోపించారు.
ప్రజలను కేసీఆర్ రెచ్చగొడుతున్నారు: విప్ లక్ష్మణ్
హైదరాబాద్, న్యూస్టుడే: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్లో కూర్చొని ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు పూర్తిగా తెరిస్తే భారాసలో ఒక్కరు కూడా మిగలరని వ్యాఖ్యానించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి ఆయన గురువారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా హాలులో మాట్లాడారు. ‘కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి రాలేదు, ప్రజలను కలవలేదు, వారి సమస్యలు పట్టించుకోలేదు. అందుకే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఓటమిపై సమీక్షించుకోకుండా కేసీఆర్ ఫాం హౌస్లో కూర్చొని సర్కారును కూలుస్తామంటూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆలోచన విధానం మార్చుకుని నిర్ణయాత్మక ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తే బాగుంటుంది’ అని లక్ష్మణ్కుమార్ సూచించారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం ఎవరికీ లేదని, కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
‘ఎన్నికల వ్యవస్థను అవహేళన చేసేలా జగన్ వ్యాఖ్యలు’
ఈనాడు, అమరావతి: నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వ్యవస్థను అవహేళన చేసేలా ఉన్నాయని భాజపా అధికార ప్రతినిధి విల్సన్ మండిపడ్డారు. ఈవీఎంలను బద్దలుకొట్టడాన్ని మామూలు నేరంగా జగన్ వ్యాఖ్యానించడం తగదని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
7న ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుకు ఘన సన్మానం
ఈనాడు, హైదరాబాద్: తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 7న (ఆదివారం) హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని ఆ పార్టీ తెలంగాణ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘన సన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్కు తరలిరావాలని గురువారం పిలుపునిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కలలు కన్నారు: జూపల్లి కృష్ణారావు
భాజపాకు పార్లమెంటులో కేసీఆర్ అనేక అంశాల్లో మద్దతు ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. -
ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లు: సీఎం చంద్రబాబు
ఏపీలో విజయానికి తెలంగాణ తెదేపా శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. -
కార్యకర్తల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు
తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
నా హత్యకు కుట్ర.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, ఆయన కుమారుడు శివనర్సింహారెడ్డితో పాటు తన గ్రామానికి చెందిన జి.కె.వెంగళరెడ్డి, గుర్రాల చెన్నారెడ్డి, లోటర్ బాషా తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్.. ఎస్పీ కృష్ణకాంత్కు ఫిర్యాదుచేశారు. -
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
‘వైకాపా ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారు. -
రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడం సంతోషకరం
విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావడం సంతోషకరమని ఏపీ భాజపా అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు పేర్కొన్నారు. -
తెదేపా దాడులను సహించం: మాజీ సీఎం జగన్
సర్వజన ఆసుపత్రి, వేంపల్లె: వైకాపాకు చెందిన 20 ఏళ్ల అజయ్రెడ్డిని తెదేపా వాళ్లు నిర్దాక్షిణ్యంగా కొట్టారని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మీరు పారదర్శకత అంటే.. ప్రజలు నవ్వుతారు
పారదర్శకత గురించి వైకాపా అధినేత జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడితే ప్రజలు నవ్వుతారని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెదేపా ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి మండిపడ్డారు. -
నేడు ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ఆదివారం రానున్నారు. -
తెదేపా నాయకులపై పెప్పర్ స్ప్రేతో వైకాపా నేత దాడి
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా, ఓటమి అక్కసుతో వైకాపా నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. -
వైకాపా హయాంలో మంజూరైన పనులు కొనసాగిస్తాం..: మంత్రి గొట్టిపాటి
వైకాపా ప్రభుత్వంలో మంజూరైన పనులను తమ సర్కారు కొనసాగిస్తుందని, మార్చడం వంటి చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. -
వైకాపాలో నియోజకవర్గాల బాధ్యుల మార్పు షురూ
ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన వైకాపాలో ఇప్పుడు నియోజకవర్గాల బాధ్యుల మార్పులు మొదలయ్యాయి. -
ఏ కేసులూ లేని ఎమ్మెల్సీలు
ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తెదేపా, జనసేన అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ తమపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులూ లేవని వెల్లడించారు. -
30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదు
రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీమంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్లో చేరిన భారాస గద్వాల ఎమ్మెల్యే
భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి వచ్చారు. సీఎం ఆయనకు కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ప్రభుత్వ సలహాదారుగా కేకే
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావును నియమిస్తూ రాష్ట్ర సర్కారు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజా వ్యవహారాల విభాగం(పబ్లిక్ ఎఫైర్స్) సలహాదారుగా ఆయనను క్యాబినెట్ మంత్రి హోదాలో నియమించింది. -
రేపు విజయవాడకు సీఎం రేవంత్రెడ్డి
ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం (ఈ నెల 8న) విజయవాడలో నిర్వహించనున్న దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. -
జీహెచ్ఎంసీ సమావేశంలో కార్పొరేటర్ల బాహాబాహీ
కార్పొరేటర్ల తోపులాటలు.. పరస్పరం దాడికి యత్నం.. కుర్చీల నుంచి తోసివేతలు.. ఇలా హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పాలకవర్గ సమావేశంలో సుమారు నాలుగు గంటలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు: మధుయాస్కీ
నిరుద్యోగులను రెచ్చగొట్టి, వారి జీవితాలను ఆగం చేయవద్దని భారాస నేతలకు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ స్పష్టంచేశారు. పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన భారాస నాయకులే... -
అభివృద్ధి కావాలన్న ఎమ్మెల్యేలు... కాంగ్రెస్లో చేరండన్న మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్కు చెందిన పలువురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో శనివారం సచివాలయంలో ఆరుగురు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబును కలవడం చర్చనీయాంశమైంది. -
పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు నిర్వహించాలి
కాంగ్రెస్ పార్టీ ‘పాంచ్ న్యాయ్ పత్ర్’ హామీ మేరకు.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి మారిన వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
-
సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్ఆర్ ఆంజనేయులు చక్కర్లు
-
ఆ విషయంలో ప్రియదర్శిపై నాకు అసూయ: విష్వక్ సేన్
-
కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కలలు కన్నారు: జూపల్లి కృష్ణారావు
-
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
-
హైదరాబాద్లో భారీగా బంగారం పట్టివేత