- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
10న తెలంగాణకు కాంగ్రెస్ కురియన్ కమిటీ
లోక్సభ ఎన్నికల్లో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించకపోవడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈ నెల 10న తెలంగాణకు రానుంది.
లోక్సభ ఎన్నికల ఫలితాలపై అధ్యయనం
హైదరాబాద్, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల్లో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించకపోవడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈ నెల 10న తెలంగాణకు రానుంది. పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేవన్న కారణాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్.. తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, దిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కమిటీలు వేసింది. తెలంగాణకు పి.జె.కురియన్ నేతృత్వంలో రకిబుల్ హుస్సేన్, పర్గత్సింగ్లతో కూడిన కమిటీని నియమించింది. తొలిసారి 10న రాష్ట్రానికి వస్తున్న ఈ కమిటీ రెండు, మూడు రోజులపాటు పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 9 ఎంపీ సీట్లను కచ్చితంగా గెలుచుకుంటుందని, మరికొంత కష్టపడితే 12 నుంచి 14 స్థానాలను కైవసం చేసుకోవచ్చని మొదట్లో భావించింది. మహబూబ్నగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో గెలుస్తామని ధీమాగా ఉన్నా... అక్కడే ఓటమి చెందడం పార్టీని అసంతృప్తికి లోనుచేసింది. కురియన్ కమిటీ సభ్యులు ఈ నియోజకవర్గాల్లో పర్యటించి ఆయా జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్యనేతలను కలిసి ఓటమికి కారణాలు, వారి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
‘వైకాపా ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారు. -
రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడం సంతోషకరం
విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావడం సంతోషకరమని ఏపీ భాజపా అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు పేర్కొన్నారు. -
తెదేపా దాడులను సహించం: మాజీ సీఎం జగన్
సర్వజన ఆసుపత్రి, వేంపల్లె: వైకాపాకు చెందిన 20 ఏళ్ల అజయ్రెడ్డిని తెదేపా వాళ్లు నిర్దాక్షిణ్యంగా కొట్టారని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, ఆయన కుమారుడు శివనర్సింహారెడ్డితో పాటు తన గ్రామానికి చెందిన జి.కె.వెంగళరెడ్డి, గుర్రాల చెన్నారెడ్డి, లోటర్ బాషా తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్.. ఎస్పీ కృష్ణకాంత్కు ఫిర్యాదుచేశారు. -
మీరు పారదర్శకత అంటే.. ప్రజలు నవ్వుతారు
పారదర్శకత గురించి వైకాపా అధినేత జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడితే ప్రజలు నవ్వుతారని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెదేపా ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి మండిపడ్డారు. -
నేడు ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ఆదివారం రానున్నారు. -
తెదేపా నాయకులపై పెప్పర్ స్ప్రేతో వైకాపా నేత దాడి
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా, ఓటమి అక్కసుతో వైకాపా నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. -
వైకాపా హయాంలో మంజూరైన పనులు కొనసాగిస్తాం..: మంత్రి గొట్టిపాటి
వైకాపా ప్రభుత్వంలో మంజూరైన పనులను తమ సర్కారు కొనసాగిస్తుందని, మార్చడం వంటి చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. -
వైకాపాలో నియోజకవర్గాల బాధ్యుల మార్పు షురూ
ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన వైకాపాలో ఇప్పుడు నియోజకవర్గాల బాధ్యుల మార్పులు మొదలయ్యాయి. -
ఏ కేసులూ లేని ఎమ్మెల్సీలు
ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తెదేపా, జనసేన అభ్యర్థులు సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ తమపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులూ లేవని వెల్లడించారు. -
30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదు
రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీమంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్లో చేరిన భారాస గద్వాల ఎమ్మెల్యే
భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి వచ్చారు. సీఎం ఆయనకు కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ప్రభుత్వ సలహాదారుగా కేకే
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావును నియమిస్తూ రాష్ట్ర సర్కారు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజా వ్యవహారాల విభాగం(పబ్లిక్ ఎఫైర్స్) సలహాదారుగా ఆయనను క్యాబినెట్ మంత్రి హోదాలో నియమించింది. -
రేపు విజయవాడకు సీఎం రేవంత్రెడ్డి
ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం (ఈ నెల 8న) విజయవాడలో నిర్వహించనున్న దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. -
జీహెచ్ఎంసీ సమావేశంలో కార్పొరేటర్ల బాహాబాహీ
కార్పొరేటర్ల తోపులాటలు.. పరస్పరం దాడికి యత్నం.. కుర్చీల నుంచి తోసివేతలు.. ఇలా హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పాలకవర్గ సమావేశంలో సుమారు నాలుగు గంటలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు: మధుయాస్కీ
నిరుద్యోగులను రెచ్చగొట్టి, వారి జీవితాలను ఆగం చేయవద్దని భారాస నేతలకు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ స్పష్టంచేశారు. పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన భారాస నాయకులే... -
అభివృద్ధి కావాలన్న ఎమ్మెల్యేలు... కాంగ్రెస్లో చేరండన్న మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్కు చెందిన పలువురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో శనివారం సచివాలయంలో ఆరుగురు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబును కలవడం చర్చనీయాంశమైంది. -
పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు నిర్వహించాలి
కాంగ్రెస్ పార్టీ ‘పాంచ్ న్యాయ్ పత్ర్’ హామీ మేరకు.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి మారిన వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
నేడు ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ఆదివారం రానున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 65లోని ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీ చేపట్టి స్వాగతం పలకాలని తెలంగాణ తెదేపా నిర్ణయించింది. -
గుజరాత్లో భాజపాను ఓడిస్తాం
ఎన్నికల్లో భాజపాను అయోధ్యలో (ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో) ఓడించినట్లే గుజరాత్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చెప్పారు. -
అస్తిత్వ రాజకీయాలే ప్రతిబంధకాలు
సంస్థాగతంగా పార్టీ పునాదులు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎంలో అంతర్మథనం జరుగుతోంది. కుల, మత, జాతుల ప్రాతిపదికన విస్తరిస్తున్న అస్తిత్వ రాజకీయాలు వామపక్ష శక్తులకు తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిప్రాయపడింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
-
‘మీరు భలే ఉంటారు...’! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?