దిల్లీ, హరియాణాల్లో ఆప్‌తో పొత్తు లేనట్లే

త్వరలో శాసనసభ ఎన్నికలు జరగబోయే దిల్లీ, హరియాణాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)తో కలిసి పోటీచేసే అవకాశం లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. అయితే మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లతో;

Published : 05 Jul 2024 04:19 IST

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో కూటమిగానే పోటీ: కాంగ్రెస్‌

దిల్లీ: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగబోయే దిల్లీ, హరియాణాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)తో కలిసి పోటీచేసే అవకాశం లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. అయితే మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లతో; ఝార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి బరిలోకి దిగుతామని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ గురువారం వెల్లడించారు. ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘‘సార్వత్రిక ఎన్నికల కోసమే ‘ఇండియా’ కూటమి అని గతంలో చెప్పాం. అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఫార్ములా అంటూ ఏదీ లేదు. పంజాబ్‌లో మా కూటమి లేదు. లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలో ఆప్‌నకు ఓ సీటు ఇచ్చాం. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని భావించడం లేదు. దిల్లీలోనూ పొత్తు ఉండదని ఆప్‌ స్వయంగా చెప్పింది’’ అని జైరాం రమేశ్‌ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలో కాంగ్రెస్, ఆప్‌ కలిసి పోటీ చేయగా.. పంజాబ్‌లో వేర్వేరుగా పోటీ చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని