- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మోదీ, అనురాగ్లపై చర్యలు తీసుకోండి
పార్లమెంటులో సత్య దూరమైన, కచ్చితంకాని, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిన ప్రధాని మోదీ, ఎంపీ అనురాగ్ ఠాకుర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లేఖ రాశారు.
పార్లమెంటులో అవాస్తవాలను చెప్పారు
స్పీకర్కు కాంగ్రెస్ లేఖ
దిల్లీ: పార్లమెంటులో సత్య దూరమైన, కచ్చితంకాని, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిన ప్రధాని మోదీ, ఎంపీ అనురాగ్ ఠాకుర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లేఖ రాశారు. 115 (1) కింద మోదీ, ఠాకుర్లపై ఆదేశాలిచ్చే అధికారాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.8,500 ఇస్తామని కాంగ్రెస్ తప్పుడు వాగ్దానం చేసిందని అన్నారని, విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పడం తప్పుడు వాగ్దానం ఎలా అవుతుందని మాణికం ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసిన రాష్ట్రాల్లో 16చోట్ల ఓట్ల శాతం పడిపోయిందని మోదీ అన్నారని, అయితే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం అనూహ్యంగా పెరిగిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఆర్మీ జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కేంద్రం సమకూర్చలేదని ప్రధాని అనడం ఏమాత్రం సరికాదని, అప్పట్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొరత ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, అసలు జాకెట్లే లేవని చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. సైన్యానికి ఫైటర్ జెట్లను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని మోదీ చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు జాగ్వార్, మిగ్-29, ఎస్యూ-30, మిరాజ్-2000 లాంటి ఫైటర్ జెట్లతో న్యూక్లియర్ బాంబులు, అగ్ని, పృథ్వీ, అకాశ్, నాగ్, త్రిశూల్ ఆ తర్వాత బ్రహ్మోస్ లాంటి అద్భుత క్షిపణులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మందిని అభివృద్ధి పథంవైపు నడిపించామన్న అనురాగ్ వ్యాఖ్యల్లోనూ నిజం లేదని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే: కేంద్ర మంత్రి బండి సంజయ్
ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భాజపాలో చేరాలంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పష్టంచేశారు. -
ఫిరాయింపులపై మాట్లాడే హక్కు భారాస నేతలకు లేదు
పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు భారాస నాయకులకు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
గాడి తప్పుతున్న విద్యావ్యవస్థను చక్కదిద్దండి
రాష్ట్రంలో గాడితప్పుతున్న విద్యావ్యవస్థను ప్రభుత్వం వెంటనే చక్కదిద్దాలని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు కోరారు. -
కేంద్రం ధోరణితోనే ఎస్సీ వర్గీకరణలో జాప్యం
ఎస్సీ వర్గీకరణ అంశంపై భాజపా ప్రభుత్వం ఇప్పటికీ నాన్చుతుండటంతో విద్య, ఉద్యోగావకాశాల్లో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం
రాష్ట్రంలో రోజుకో రైతు ప్రాణం పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం సిగ్గు చేటని భారాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. -
అణగారిన వర్గాల సమస్యలపై పోరాటం
ఎస్సీ వర్గీకరణతో పాటు అణగారిన వర్గాల సమస్యలపై ఎమ్మార్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (3)
విభజన చట్టంలోని ఆస్తుల పంపకాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని తమ పార్టీ స్వాగతిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి
తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ కావడం ఒక మంచి ముందడుగు అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. -
ప్రజాస్వామ్య స్ఫూర్తికి రుజువు
లోక్సభ స్పీకర్ పదవికి పోటీ జరగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి రుజువని, అది వర్థిల్లడానికి సూచికని ఓం బిర్లా స్పష్టం చేశారు. -
మన భూభాగంలో చైనా బంకర్లా?
చైనాతో సరిహద్దుల విషయంలో అందరి అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండు చేశారు. -
అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం
‘ఆంధ్రప్రదేశ్లో ఉన్నది సైకోనే కాదు ఓ భూతం. అభివృద్ధిని అడ్డుకునే ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నేనే తీసుకుంటా. పెట్టుబడులు పెట్టాలని అక్కడికి రమ్మని కొందరిని అడిగితే.. మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డుంది. -
టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టిన ఘనత జగన్దే
తెదేపా హయాంలో 90% పూర్తిచేసిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.7వేల కోట్లకు బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఘనత మాజీ సీఎం జగన్దేనని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలి
ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శనివారం రాత్రి భేటీ అయ్యారు. పవన్కల్యాణ్ ఆహ్వానం మేరకు విజయవాడలోని ఆయన నివాసంలో పల్లా శ్రీనివాసరావు కలిశారు. -
టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ సూత్రధారి: బుద్ధా వెంకన్న
టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ సీఎం జగన్ సూత్రధారి అని తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయవాడలో ఆదివారం ఆయన మాట్లాడారు. -
భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేడు
భాజపా రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం నిర్వహించనున్నారు. -
వైఎస్సార్ ఘాట్ వద్దకు నేడు జగన్, షర్మిల
వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు సోమవారం నివాళులర్పించనున్నారు. వైకాపా అధినేత జగన్ శనివారమే పులివెందులకు చేరుకోగా.. -
పేపర్ లీక్లతో యువత కలల్ని నాశనం చేసినోళ్లను వదిలేది లేదు.. సీఎం భజన్లాల్ శర్మ
రాష్ట్రంలో పలు ఉద్యోగ నియామక పరీక్షల పేపర్లీకేజీలతో యువత ఆశల్ని నాశనం చేసినవాళ్లను వదిలేది లేదని సీఎం భజన్లాల్ శర్మ హెచ్చరించారు. -
వాస్తవాన్ని గుర్తించండి.. రాహుల్కు కేంద్రమంత్రి సింధియా చురక!
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ పార్టీ.. గుజరాత్లో గెలుస్తామని పగటి కలలు కంటోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎద్దేవా చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బయట నుంచి చూస్తే కప్బోర్డ్.. లోపల మాత్రం ఉగ్ర స్థావరం
-
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
-
బతికుండగానే కన్నకూతురిని సమాధి చేసిన తండ్రి
-
అలా చేయగల ఏకైక నటుడు కమల్హాసన్: బ్రహ్మానందం
-
6 గంటల్లో 300 మి.మి.ల వాన.. ముంబయిని వణికించిన వరుణుడు
-
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జగన్, షర్మిల