Bandla Krishnamohan Reddy: కాంగ్రెస్‌లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి?

భారాసకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Updated : 04 Jul 2024 07:40 IST

ఈనాడు, మహబూబ్‌నగర్‌: భారాసకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు స్థానికంగా ఎమ్మెల్యేకు, గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరితకు మధ్య విబేధాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డి చేతిలోనే ఓడిపోయారు. గురువారంతో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా సరిత పదవీకాలం ముగియనుంది. దీంతో ఎమ్మెల్యే పార్టీ మారడం దాదాపుగా ఖాయమైందని, వారం రోజుల్లో ఎప్పుడైనా భారాసను వీడతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇదే విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని ‘ఈనాడు’ సంప్రదించగా... ‘‘పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కార్యకర్తల అభిప్రాయం తీసుకుని చేరికపై నిర్ణయం తీసుకుంటా’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని