వైఎస్‌ జయంతి వేడుకలకు సోనియా, రాహుల్‌గాంధీ

విజయవాడలో ఈ నెల 8న నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేత సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర ఏఐసీసీ పెద్దలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు హాజరవుతున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు.

Updated : 03 Jul 2024 04:47 IST

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడి

షర్మిలను సత్కరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: విజయవాడలో ఈ నెల 8న నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేత సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర ఏఐసీసీ పెద్దలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు హాజరవుతున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. మంగళవారం ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులను హైదరాబాద్‌లో వేర్వేరుగా కలిసి ఆహ్వానించారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు కన్వీనర్‌గా వేడుకల నిర్వహణకు ఎనిమిది మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో కమిటీ ఏర్పాటు చేశారు.

ప్రజాభవన్‌లో భట్టితో మాట్లాడుతూ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని