- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
తెలంగాణ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి
తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే సమగ్ర సమాచారాన్ని గత ప్రభుత్వం రూపొందించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.
సీఎస్కు కేటీఆర్ లేఖ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే సమగ్ర సమాచారాన్ని గత ప్రభుత్వం రూపొందించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఇది ఏ ఒక్క వ్యక్తికో, రాజకీయ పార్టీకో సంబంధించిన సమాచారం కానే కాదని, ఇది ప్రజల ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, తర్వాత సంఘటనలకు సంబంధించి ఈ విలువైన సమాచారం శతాబ్దాలపాటు ఉండాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్లో గత సర్కారుకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారికి మంగళవారం ఆయన లేఖ రాశారు. ‘‘కేసీఆర్ సీఎంగా ఉన్న(జూన్ 2014- డిసెంబరు 2023) నాటి సమయంలోని వేలాది ఫొటోలు, వీడియోలతోపాటు ఎంతో సమాచారాన్ని తొలగించారు. దీని వెనక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులే ఉన్నారనే సందేహం కూడా ఉంది. ఈ హేయమైన చర్యను ఆపి.. సమాచారాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మీపై ఉంది. తొలగించిన కంటెంట్ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను మీరు ఆదేశించాలి. కొందరి ఇష్టాయిష్టాల కోసం ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే తెలంగాణ భవిష్యత్ తరాలు క్షమించవు’’ అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. 2024 జనవరి తర్వాత సమాచారం తొలగించిన వెబ్సైట్లు, పోర్టల్స్ వివరాలను ఆయన జతపర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాతీర్పు శిరోధార్యం
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, వారి తీర్పే శిరోధార్యమని, వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. -
భారాసకు భారీ షాక్
భారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. -
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ విఫలం: కేటీఆర్
రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే రాహుల్ గాంధీ దాని స్ఫూర్తిని కాపాడడంలో విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా
భారాసను వీడి కాంగ్రెస్లో చేరిన కె.కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. -
సంక్షిప్త వార్తలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు ఈ నెల 6న భేటీ కావడం హర్షణీయమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు. -
ఫోన్ట్యాపింగ్తో సంబంధం లేదు: ఎమ్మెల్సీ నవీన్కుమార్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని భారాస ఎమ్మెల్సీ కె.నవీన్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించేందుకు ఎవరు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. -
10న తెలంగాణకు కాంగ్రెస్ కురియన్ కమిటీ
లోక్సభ ఎన్నికల్లో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించకపోవడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈ నెల 10న తెలంగాణకు రానుంది. -
ఆడిన మాట తప్పని రాజస్థాన్ మంత్రి కిరోడిలాల్
భాజపా సీనియర్ నేత, రాజస్థాన్ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి కిరోడి లాల్ మీనా (72) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆమోదించలేదు. -
అన్నీ గవర్నర్ చేతుల్లో ఉండవు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్ బిమన్ బెనర్జీ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
దిల్లీ, హరియాణాల్లో ఆప్తో పొత్తు లేనట్లే
త్వరలో శాసనసభ ఎన్నికలు జరగబోయే దిల్లీ, హరియాణాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కలిసి పోటీచేసే అవకాశం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లతో; -
మళ్లీ సీఎంగా హేమంత్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. -
పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతన్న సంక్షేమంపై లేదు
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. -
పోలవరం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని సీపీఎం స్వాగతించింది. ఈనెల 6వ తేదీన హైదరాబాద్లో జరిగే ఈ భేటీలో రాష్ట్ర విభజన సందర్భంగా అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. -
పదెకరాల వరకు ‘రైతు భరోసా’ అమలు చేయండి
రైతు భరోసా పథకం అమలు కోసం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై సూచనలు, సలహాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. -
మోదీ, అనురాగ్లపై చర్యలు తీసుకోండి
పార్లమెంటులో సత్య దూరమైన, కచ్చితంకాని, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిన ప్రధాని మోదీ, ఎంపీ అనురాగ్ ఠాకుర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లేఖ రాశారు. -
భాజపా ఓ పరాన్నజీవి
భాజపా ఓ పరాన్నజీవి లాంటిదని, ప్రాంతీయ పార్టీలను మింగేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. పార్లమెంటు బయట ఏకాభిప్రాయం గురించి ప్రధాని మోదీ మాట్లాడతారని, లోపల ఘర్షణ పడతారని విమర్శించారు. -
అగ్నిపథ్పై శ్వేతపత్రం విడుదల చేయండి
అగ్నిపథ్పై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది. అగ్ని వీరులపట్ల వివక్ష ఉందని అభిప్రాయపడింది. క్షేత్ర స్థాయి పరిస్థితులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని స్పష్టం చేసింది. -
భాజపాతో ఘర్షణ లేదు: జేడీయూ
బిహార్కు ప్రత్యేక హోదా మంజూరు కోసం ఒత్తిడి చేసినంతమాత్రాన కేంద్రంలో భాజపా సారథ్యంలోని ఎన్డీయే సర్కారుతో ఎలాంటి ఘర్షణ తలెత్తదని జనతాదళ్ (యునైటెడ్) కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్కుమార్ ఝా స్పష్టం చేశారు. -
పుదుచ్చేరి ప్రభుత్వంలో ముసలం
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ఏఐఎన్ఆర్సీ-భాజపా సంకీర్ణ సర్కార్లో రాజకీయ సంక్షోభానికి తాజాగా బీజం పడింది. అవినీతి సహా పలు అంశాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొందరు భాజపా సహా ఇతర ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. -
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
భారత రాష్ట్ర సమితి (భారాస)కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. భారాస నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రజా వేదిక శిథిలాలు అక్కడే
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!