మీ సర్కారుకు ప్రజలు అదే చెప్పారు

లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లు ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకోవడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు.

Published : 03 Jul 2024 04:12 IST

మోదీ ప్రసంగంపై ఖర్గే వ్యాఖ్య

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లు ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకోవడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. ‘‘లోక్‌సభలో చేసిన ప్రసంగంలో మీరు (మోదీ) కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. తుమ్‌సే న హో పాయేగా (మీవల్ల కాదు) అని అన్నారు. నిజానికి 140 కోట్లమంది ప్రజలు మీ సర్కారుకు చెప్పిన సందేశం అదే. ఆదాయం రెట్టింపు చేస్తామని మీరు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో రైతులు మీకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకు యువత కూడా తుమ్‌సే న హో పాయేగా అన్నారు’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని