అగ్నివీరులపై రాహుల్‌గాంధీ అసత్య ప్రచారాలు

అగ్నివీరులు విధి నిర్వహణలో మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ముపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ధ్వజమెత్తారు.

Published : 02 Jul 2024 06:50 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ధ్వజం

ఈనాడు డిజిటల్, అమరావతి: అగ్నివీరులు విధి నిర్వహణలో మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ముపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ధ్వజమెత్తారు. అగ్నివీరుల మరణాంతరం వారి కుటుంబానికి లభించే సొమ్మును ఆమె వివరించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో సోమవారం పోస్ట్‌ చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాధానం చెప్పే వీడియోనూ పోస్ట్‌కు జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని