- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
కోట్ల మంది హిందువులను అవమానించారు
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ఇంటా బయటా భాజపా ధ్వజమెత్తింది. హిందువులంతా హింసాత్మక వాదులంటూ ఆయన కోట్ల మందిని అవమానపరిచారని విమర్శించింది.
రాహుల్పై భాజపా ధ్వజం
అలా అనలేదన్న ప్రియాంక
దిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ఇంటా బయటా భాజపా ధ్వజమెత్తింది. హిందువులంతా హింసాత్మక వాదులంటూ ఆయన కోట్ల మందిని అవమానపరిచారని విమర్శించింది. అయితే హిందువులందరినీ రాహుల్ అనలేదని, భాజపా వారిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను హిందూ సాధువులు పలువురు ఖండించారు. వారిలో స్వామి అవధేశానంద గిరి, స్వామి బాలయోగి అరుణ్ పురీ ఉన్నారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.
- కోట్ల మంది హిందువులను రాహుల్ గాంధీ అవమానించారు. వారంతా హింసకు పాల్పడతారని, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తారని, అబద్ధాలు చెబుతారని వ్యాఖ్యానించడంద్వారా మనోభావాలను దెబ్బతీశారు. ఆయన క్షమాపణ చెప్పాలి.
అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
- మొదటి రోజు రాహుల్ది చెత్త ప్రదర్శన. అబద్ధాలను, హిందుత్వ వ్యతిరేకతను ఆయన ప్రదర్శించారు. దీనిద్వారా 2024 తీర్పును ఆయన సరిగా అర్థం చేసుకోలేదనిపిస్తోంది. 5సార్లు ఎంపీగా గెలిచిన రాహుల్ పార్లమెంటరీ సంప్రదాయాలను సరిగా నేర్చుకోలేదు.
జేపీ నడ్డా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
- హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. దేశంలో ప్రజలు శాంతియుతంగా జీవిస్తారు. ప్రపంచాన్ని చూడండి.. ఎక్కడా ప్రశాంతత లేదు. పాకిస్థాన్లోనూ అదే పరిస్థితి. మన దేశంలో శాంతియుతంగా ఉన్నాం.
జి.కిషన్రెడ్డి, కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి
- రాహుల్ గాంధీ హిందువులను అవమానించలేదు. భాజపా నేతలను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
రాహుల్ వర్సెస్ రాజ్నాథ్
అగ్నిపథ్పై మాటల తూటాలు
దిల్లీ: లోక్సభలో సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ల మధ్య మాటల తూటాలు పేలాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ను ‘యూజ్ అండ్ త్రో లేబర్’ పథకంగా రాహుల్ అభివర్ణించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజ్నాథ్ సింగ్.. ప్రతిపక్ష నేత ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ‘మందుపాతర పేలి ఒక అగ్నివీర్ ప్రాణాలు కోల్పోతే అతడిని అమర వీరుడిగా పరిగణించరు. నేను అమరుడన్నా.. కేంద్ర ప్రభుత్వంగానీ, ప్రధాని మోదీగానీ ఆ పేరుతో పిలవరు. కేవలం అగ్నివీర్గానే గుర్తిస్తారు. అతడి కుటుంబానికి పెన్షన్ రాదు. ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వరు. కేంద్రం దృష్టిలో అగ్ని వీరులంతా ఉపయోగించుకుని వదిలేసే ఓ లేబర్ లాంటివారు’ అంటూ రాహుల్ ఘాటుగా విమర్శించారు. ఈ పథకాన్ని తీసుకొస్తున్నప్పుడే దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు జరిగినట్లు సభకు వివరించారు. ‘మీరు సైనికులను విభజిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఒకరిని అమరుడు అంటున్నారు. మరొకరిని అగ్నివీరుడు అంటున్నారు. ఒకరికి పెన్షన్ వస్తుంది. మరొకరికి రాదు. అగ్ని వీరుడు జవాన్గా పిలిపించుకోలేడు. మీరన్నట్లుగా దేశభక్తుడిగానే మిగిలిపోతాడు’ అంటూ అగ్నివీర్, జవాన్కు మధ్య తేడాలను వివరిస్తూ అధికార పక్షంపై మండిపడ్డారు.
158 సంస్థల అభిప్రాయాలు తీసుకున్నాం: రాజ్నాథ్
రాహుల్ మాట్లాడుతున్న సమయంలో.. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా మధ్య కూర్చున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రకటనలు చేస్తూ.. రాహుల్ గాంధీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ఓవైపు రాజ్నాథ్ మాట్లాడుతుండగానే.. ‘నేను తప్పు మాట్లాడలేదు.. నేను తప్పు మాట్లాడలేదు’ అంటూ రాహుల్ నిరసన వ్యక్తం చేశారు. అగ్నివీర్ పథకం తీసుకొచ్చే ముందు చాలా ఆలోచించామని, పలువురు నిష్ణాతులు, 158కి పైగా సంస్థల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే దీన్ని అమల్లోకి తీసుకొచ్చామని రాజ్నాథ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎట్టకేలకు వైకాపా నేతల అరెస్టు
గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ను నిందితులుగా గుర్తించారు. -
నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం కోరే ఉద్దేశంతో చంద్రబాబు బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. -
కనీసం తాగునీటి పరీక్షలూ జరగలేదు
గత వైకాపా ప్రభుత్వ విధ్వంస పాలన వల్ల ప్రజలు బలవుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. -
చట్ట పరిధిలో దోషుల్ని శిక్షిద్దాం.. క్షేత్రస్థాయికి వెళ్లొద్దు
‘‘దోషుల్ని చట్ట పరిధిలో శిక్షిద్దాం. అంతేతప్ప క్షేత్రస్థాయికి వ్యక్తిగతంగా వెళ్లొద్దు’’ అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -
రేపు హైదరాబాద్కు చంద్రబాబునాయుడు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ఆయన చేరుకుంటారు. -
9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.3,480 కోట్లు ఎగ్గొట్టిన జగన్
రాష్ట్రంలో సుమారు 9,44,666 మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తాం
వైకాపా అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఈ రాష్ట్రానికి అంకితభావం ఉన్న నాయకులు కలిస్తే తప్ప అభివృద్ధి రాదన్నది తన విశ్వాసమని.. చంద్రబాబు అనుభవం, కార్యదక్షత ప్రభుత్వాన్ని నడిపించగలవని నమ్మానని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు. -
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?
‘వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం.. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు. బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు. పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం. -
జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం జాప్యం: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
కర్ణాటక ఉపముఖ్యమంత్రితో వైఎస్ షర్మిల చర్చలు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్తో బెంగళూరులో సమావేశమయ్యారు. నగరంలోని సదాశివనగరలో డీకే శివకుమార్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వర్తమాన రాజకీయాలపై చర్చించారు. -
గడువులోగా పురపాలక ఎన్నికలు అనుమానమే!
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు గడువులోగా నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. పలు చిక్కుముడులు వీడితే తప్ప ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అధికార యంత్రాంగం సైతం అభిప్రాయపడుతోంది. -
ఏపీలో ఏడు మండలాల విలీనానికి భారాస, భాజపాలే కారణం
రైతుభరోసా అమలుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, త్వరలో రుణమాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. -
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై.. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 221, 126(2) కింద కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. -
2028 ఎన్నికల్లో భారాసదే అధికారం
రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, ఓటమి తర్వాత వచ్చేది గెలుపేనని.. 2028 ఎన్నికల్లో భారాస మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
రాజకీయ వ్యవహారాల కమిటీలో కిషన్రెడ్డి
దేశంలో భద్రత, ఆర్థిక, రాజకీయాలతో పాటు పలు వ్యవహారాల పరిశీలనకు మోదీ ప్రభుత్వం 8 క్యాబినెట్ కమిటీలను బుధవారం ఏర్పాటు చేసింది. -
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్నినెలలకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భాజపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. -
సంక్షిప్త వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తోందని భాజపా ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం వాయిదాపడింది. -
కాంగ్రెస్లో చేరిన కేశవరావు
భారాస తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు కె.కేశవరావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి
అధికారంలోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర విరక్తి చెందారని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
ఏఈఈల తుది జాబితా ప్రకటించాలి
ఏఈఈ (సివిల్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.