ఏపీకి ప్రత్యేక హోదా హామీ నెరవేరాలన్న జైరాం రమేశ్‌

వెంకయ్యనాయుడికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. భాజపా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో రాజ్యసభలో ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

Published : 02 Jul 2024 05:23 IST

దిల్లీ: వెంకయ్యనాయుడికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. భాజపా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో రాజ్యసభలో ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ కూడా 2014లో పవిత్ర నగరమైన తిరుపతిలో ఇదే హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాజ్యసభలో తరచూ తమ మధ్య స్నేహపూరిత ఘర్షణలు జరిగేవని చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ఆయన ఉన్నప్పుడు ఎన్నో సవాళ్లకు తమను గురిచేసినా ఆ సందర్భాల్లో ఆయన ప్రాసతో చెప్పే మాటలు ఎవరినీ నొప్పించేవికావన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని