ప్రత్యేక హోదాపై తీర్మానం చేయండి

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాలని సీఎం చంద్రబాబుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సూచించారు.

Published : 02 Jul 2024 05:22 IST

సీఎం చంద్రబాబుకు షర్మిల సూచన

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాలని సీఎం చంద్రబాబుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సూచించారు. బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం సీఎం నీతీశ్‌ కుమార్‌ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. మోదీ సర్కారులో కింగ్‌ మేకర్‌గా ఉన్న చంద్రబాబు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజధాని లేక వెనకబడి ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకమని ‘ఎక్స్‌’లో సోమవారం ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని