- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
‘శేషాచలం అడవుల్లో కొట్టేసి, అక్రమంగా తరలించిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. వైకాపా ప్రభుత్వంలో ఇక్కడి చెక్పోస్టుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్రెడ్డి పేరు చెబితే వదిలేశారు.
అక్కడ పట్టుబడ్డ వేల టన్నుల ఎర్రచందనం
ఆరా తీస్తే, పెద్దిరెడ్డి, మిథున్రెడ్డిలదని తేలింది
జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్
ఈనాడు, కాకినాడ: ‘శేషాచలం అడవుల్లో కొట్టేసి, అక్రమంగా తరలించిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. వైకాపా ప్రభుత్వంలో ఇక్కడి చెక్పోస్టుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్రెడ్డి పేరు చెబితే వదిలేశారు. కానీ నేపాల్ పోలీసులకు వీళ్లెవరో తెలీదు కదా, అక్కడ ఆపేశారు. ఆరా తీస్తే తిరుపతి నుంచి వచ్చాయని తేలింది. ఇప్పుడా ఆ ఫైల్ నా దగ్గరకు వచ్చింది. ఆ ఎర్రచందనాన్ని తీసుకురావడానికి కిందామీదా పడుతున్నాం. దీన్నిబట్టి మన చెక్పోస్టులు ఎంత అలసత్వంగా ఉన్నాయో అర్థమవుతోంద’ని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం పిఠాపురం జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘అడవిని కొట్టడం సులువే. పెంచడం ఎంత కష్టమో తెలుసా? అన్నానికి బదులు మీరు డబ్బు తింటారా?’ అని వైకాపా నాయకులను పవన్ ప్రశ్నించారు. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, దీని వెనుకున్న సూత్రధారులను పట్టుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్కు చెప్పినట్లు పవన్ తెలిపారు.
ఇప్పుడు 11 వచ్చాయ్.. రేపు ఒకటే రావొచ్చు
‘వైకాపాకు 151 సీట్లు ఇచ్చి కాలం పరీక్ష పెట్టింది. వాళ్లు ఏదైనా చేసేయొచ్చు అనుకున్నారు. ఫలితం ఎదుర్కొన్నారు. ఈసారి 11 వచ్చాయి. రేపు ఒకటే రావొచ్చు. మనకి ఒకటి వచ్చినప్పుడు వాళ్లకూ రాకూడదని లేదుగా’ అని పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు బై బై జగన్ అని నినదించగా.. ఒకసారి చెప్పేశాం కదా, ఎన్నిసార్లు చెబుతామని పవన్ ప్రశ్నించారు. ‘బాబూ మీకు దండం పెడతా. వైకాపా నాకు శత్రువు కాదు. వారి లాగా మనమూ చేస్తే, వారికీ మనకూ తేడా ఏంటి? వ్యక్తిగత దాడులకు దిగొద్దు. క్రమశిక్షణ పాటించండి. ప్రజా సమస్యలపైనే మాట్లాడండి’ అని కార్యకర్తలకు జనసేనాని హితవు పలికారు. ‘మీరంతా సీఎం సీఎం అని అరిచి ప్రకృతిని, భగవంతుడ్ని భయపెట్టారు. కనీసం ఉప ముఖ్యమంత్రైనా కాకపోతే ఎలా అని ప్రకృతి కదిలిపోయింది. నేను డిప్యూటీ సీఎంనయ్యాను. కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. వేల కోట్లు కావాలి, రుషికొండ కావాలి, దేవాదాయ భూములు కొట్టేయాలంటే జరగద’ని పేర్కొన్నారు. సమావేశంలో జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్కుమార్, పిఠాపురం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనీసం తాగునీటి పరీక్షలూ జరగలేదు
గత వైకాపా ప్రభుత్వ విధ్వంస పాలన వల్ల ప్రజలు బలవుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. -
చట్ట పరిధిలో దోషుల్ని శిక్షిద్దాం.. క్షేత్రస్థాయికి వెళ్లొద్దు
‘‘దోషుల్ని చట్ట పరిధిలో శిక్షిద్దాం. అంతేతప్ప క్షేత్రస్థాయికి వ్యక్తిగతంగా వెళ్లొద్దు’’ అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -
రేపు హైదరాబాద్కు చంద్రబాబునాయుడు
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ఆయన చేరుకుంటారు. -
9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.3,480 కోట్లు ఎగ్గొట్టిన జగన్
రాష్ట్రంలో సుమారు 9,44,666 మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తాం
వైకాపా అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఈ రాష్ట్రానికి అంకితభావం ఉన్న నాయకులు కలిస్తే తప్ప అభివృద్ధి రాదన్నది తన విశ్వాసమని.. చంద్రబాబు అనుభవం, కార్యదక్షత ప్రభుత్వాన్ని నడిపించగలవని నమ్మానని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు. -
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?
‘వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం.. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు. బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు. పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం. -
జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం జాప్యం: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
కర్ణాటక ఉపముఖ్యమంత్రితో వైఎస్ షర్మిల చర్చలు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్తో బెంగళూరులో సమావేశమయ్యారు. నగరంలోని సదాశివనగరలో డీకే శివకుమార్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వర్తమాన రాజకీయాలపై చర్చించారు. -
గడువులోగా పురపాలక ఎన్నికలు అనుమానమే!
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు గడువులోగా నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. పలు చిక్కుముడులు వీడితే తప్ప ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అధికార యంత్రాంగం సైతం అభిప్రాయపడుతోంది. -
ఏపీలో ఏడు మండలాల విలీనానికి భారాస, భాజపాలే కారణం
రైతుభరోసా అమలుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, త్వరలో రుణమాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. -
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై.. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 221, 126(2) కింద కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. -
2028 ఎన్నికల్లో భారాసదే అధికారం
రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, ఓటమి తర్వాత వచ్చేది గెలుపేనని.. 2028 ఎన్నికల్లో భారాస మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
రాజకీయ వ్యవహారాల కమిటీలో కిషన్రెడ్డి
దేశంలో భద్రత, ఆర్థిక, రాజకీయాలతో పాటు పలు వ్యవహారాల పరిశీలనకు మోదీ ప్రభుత్వం 8 క్యాబినెట్ కమిటీలను బుధవారం ఏర్పాటు చేసింది. -
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్నినెలలకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భాజపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. -
సంక్షిప్త వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తోందని భాజపా ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం వాయిదాపడింది. -
కాంగ్రెస్లో చేరిన కేశవరావు
భారాస తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు కె.కేశవరావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి
అధికారంలోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర విరక్తి చెందారని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
ఏఈఈల తుది జాబితా ప్రకటించాలి
ఏఈఈ (సివిల్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసిన ఎంపీ ఈటల
రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ను బుధవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
భారాసకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
-
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
-
కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది
-
ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
-
క్షమించండి.. నెలలో తిరిగిస్తా.. ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ
-
తూర్పుగోదావరి జిల్లాలో ప్రాణం నిలిపిన పింఛను!