మోదీజీ.. నవ్వరెందుకో!

లోక్‌సభ సమావేశాలు సోమవారం వాడీవేడిగా సాగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు.

Published : 02 Jul 2024 04:25 IST

దిల్లీ: లోక్‌సభ సమావేశాలు సోమవారం వాడీవేడిగా సాగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఆయన ప్రసంగంలో కొన్ని ఆసక్తికర సంభాషణలు చోటుచేసుకున్నాయి. మోదీజీ.. ఎప్పుడూ సీరియస్‌గా ఎందుకు ఉంటారని ఆయన అడగ్గా.. ప్రధాని గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. ‘సభాపక్ష నేత అయిన ప్రధాని మోదీ విపక్షంతో ఎప్పుడూ సరదాగా మాట్లాడిన సందర్భాల్లేవ్‌. కనీసం మేం ఎదురుపడినప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించదు. మోదీజీ ఎందుకు ఎప్పుడు సీరియస్‌గా ఉంటారు’ అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. దీనికి ప్రధాని వెంటనే బదులిస్తూ.. ‘ప్రతిపక్ష నేతను సీరియస్‌గా తీసుకోవాలని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నాకు నేర్పించాయి’ అని వ్యాఖ్యానించారు. దీంతో అధికార పక్షం సభ్యులంతా నవ్వులు చిందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని