- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: మాజీ మంత్రి బొత్స
ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమన్నారు.
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమన్నారు. విజయనగరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందో తెలియడం లేదన్నారు. వైకాపా జిల్లా కార్యాలయాలపై జరుగుతున్న రాద్దాంతం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు వెళ్లి.. వాటిని పరిశీలించడం తగదన్నారు. ఇటీవల విజయనగరంలోని వైకాపా కార్యాలయాన్ని తెదేపా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పరిశీలించడాన్ని ఆయన తప్పుబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ప్రత్యేక హోదా హామీ నెరవేరాలన్న జైరాం రమేశ్
వెంకయ్యనాయుడికి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ శుభాకాంక్షలు తెలిపారు. భాజపా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో రాజ్యసభలో ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
తప్పులన్నీ బయటకు తీస్తాం..
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని భయపెట్టారని.. కానీ ఎక్కడా అలా జరగలేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. -
ప్రత్యేక హోదాపై తీర్మానం చేయండి
ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాలని సీఎం చంద్రబాబుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూచించారు. -
విప్లుగా బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్
జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను అధికార విప్లుగా ప్రకటించాలని కోరుతూ జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఎన్డీయే శాసనసభాపక్ష నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. -
సంక్షిప్త వార్తలు
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, పలువురు కుటుంబ సభ్యులు సోమవారం పరామర్శించారు. -
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
‘శేషాచలం అడవుల్లో కొట్టేసి, అక్రమంగా తరలించిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. వైకాపా ప్రభుత్వంలో ఇక్కడి చెక్పోస్టుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్రెడ్డి పేరు చెబితే వదిలేశారు. -
1995 నాటి చంద్రబాబును చూస్తారు
‘కొత్త శకానికి, నూతన సంస్కృతికి అందరూ అలవాటు పడాలి. అధికారులు పాత రోజులు మరిచిపోయి కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలి. పరదాలు ఎక్కడైనా కడితే ఇక ఉపేక్షించను. సస్పెండ్ చేస్తా. -
అరకు కాఫీ రైతుల నష్టాన్ని విస్మరించిన మోదీ మన్కీబాత్
ఆదివాసీ రైతుల కృషితో ఆర్గానిక్ కాఫీ సాగు వల్ల అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీకి గుర్తింపు లభించిందని, దీనిని ప్రధాని మోదీ తన మన్కీబాత్లో గుర్తించకపోవడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. -
కాంగ్రెస్లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. -
‘నీట్’ రద్దుకు రాజ్భవన్ ముట్టడి యత్నం
నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్తో రాజ్భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల ఐక్య కమిటీ చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. -
ఇంకేం బాకీ ఉంది?
గత పదేళ్ల తన పాలన ట్రైలరేనని, అసలు ఇప్పుడే మొదలైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. -
ప్రధానికి స్పీకర్ ప్రణమిల్లారు: రాహుల్ గాంధీ విమర్శ
ప్రధాని మోదీతో కరచాలనం చేసే సమయంలో స్పీకర్ ఓం బిర్లా ప్రణమిల్లారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. -
పార్టీ ఫిరాయింపులపై సీఎం తీరు సరికాదు
రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని భాజపా శాసనసభా పక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి విమర్శించారు. -
నా సభ్యత్వం రద్దు చేయాలని భాజపా ఎలా అడుగుతుంది?: దానం
తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సభాపతిని భాజపా శాసనసభా పక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ఏ హోదాలో అడుగుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. -
మోదీజీ.. నవ్వరెందుకో!
లోక్సభ సమావేశాలు సోమవారం వాడీవేడిగా సాగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. -
దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఆపండి
ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని, వెంటనే దానిని ఆపాలని ఇండియా కూటమి ఎంపీలు డిమాండు చేశారు. -
భాజపా తగిన మూల్యం చెల్లించుకుంది
నిండు సభలో ఒక మహిళా ఎంపీ నోరు నొక్కేసినందుకు.. ఈసారి ఎన్నికల్లో 63 సొంత ఎంపీ సీట్లు కోల్పోయి భాజపా తగిన మూల్యం చెల్లించుకుందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. -
భారాస నేతల కొత్త డ్రామాలు: ఎక్స్లో రాష్ట్ర కాంగ్రెస్ విమర్శ
ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నట్లు ఎక్స్లో రాష్ట్ర కాంగ్రెస్ వెల్లడించింది. -
మేడిగడ్డపై విష ప్రచారమని తేలింది
మేడిగడ్డపై ఇంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది విష ప్రచారమని ఇప్పుడు తేలిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
నల్గొండలోని భారాస కార్యాలయాన్ని కూల్చేయండి
నల్గొండలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారాస జిల్లా కార్యాలయాన్ని నిర్మించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. -
హిందువుల పేరుతో హింసను ప్రోత్సహిస్తున్న భాజపా, ఆర్ఎస్ఎస్
హిందువులమని చెప్పుకొనేవారు నిత్యం హింసను ప్రోత్సహిస్తున్నారని, విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోక్సభలో సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.