మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: మాజీ మంత్రి బొత్స

ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమన్నారు.

Published : 01 Jul 2024 05:24 IST

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమన్నారు. విజయనగరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిందో తెలియడం లేదన్నారు. వైకాపా జిల్లా కార్యాలయాలపై జరుగుతున్న రాద్దాంతం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు వెళ్లి.. వాటిని పరిశీలించడం తగదన్నారు. ఇటీవల విజయనగరంలోని వైకాపా కార్యాలయాన్ని తెదేపా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పరిశీలించడాన్ని ఆయన తప్పుబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని