ఎ.కొండూరు ఎంపీపీ భర్తపై కేసు.. కేశినేని చిన్ని కారుపై రాళ్ల దాడి

విజయవాడ ప్రస్తుత తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) కారుపై పోలింగ్‌ రోజున రాళ్లతో దాడి చేశారన్న ఫిర్యాదుపై ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడుకు చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త, వైకాపా మండల యువత అధ్యక్షుడు చెన్నారావు సహా పలువురిపై ఆదివారం కేసు నమోదైంది. ఆ వివరాలిలా ఉన్నాయి.

Published : 01 Jul 2024 04:56 IST

ఎ.కొండూరు, న్యూస్‌టుడే: విజయవాడ ప్రస్తుత తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) కారుపై పోలింగ్‌ రోజున రాళ్లతో దాడి చేశారన్న ఫిర్యాదుపై ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడుకు చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త, వైకాపా మండల యువత అధ్యక్షుడు చెన్నారావు సహా పలువురిపై ఆదివారం కేసు నమోదైంది. ఆ వివరాలిలా ఉన్నాయి. కేశినేని శివనాథ్‌ మే 13న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ సరళి పరిశీలనకు కంభంపాడు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వస్తున్న శివనాథ్‌ కారుపై చెన్నారావు తన అనుచరులతో కలిసి రాళ్లతో దాడి చేశారు. అనంతరం కారును వెంబడించి చంపుతానని బెదిరించారు. దీనిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఎ.కొండూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తాజాగా ఫిర్యాదుచేశారు. దీంతో వైకాపా వర్గీయులైన చెన్నారావు, చిమటా రామకృష్ణ, మెంతుల శివకృష్ణ, చిమటా వెంకటేశ్వరరావు, చిమటా గోపాలరావు తదితరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని