సమాజ్‌వాదీ పార్టీకే డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వండి

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ విజ్ఞప్తి చేసింది.

Published : 01 Jul 2024 04:32 IST

దిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ విజ్ఞప్తి చేసింది. అవధేశ్‌ ప్రసాద్‌ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్‌ నుంచి సమాజ్‌వాదీ ఎంపీగా గెలుపొందారు. ఆయనను డిప్యూటీ స్పీకర్‌ పదవికి అర్హుడిగా భావించిన తృణమూల్‌.. ఆయనకే బాధ్యతలను అప్పగించాలని కేంద్రాన్ని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్పీకర్‌ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై విజయం సాధించి మరోసారి ఈ పదవికి ఓం బిర్లా ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని