హస్తం గూటికి ఎమ్మెల్సీ సారయ్య!

వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది.

Published : 01 Jul 2024 04:57 IST

రంగంపేట(వరంగల్‌), న్యూస్‌టుడే: వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్‌ జిల్లా పర్యటన సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ సారయ్యతో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కొంతసేపు ఏకాంతంగా మాట్లాడారు. సారయ్యతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీల చేరికలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. రెండు నెలల క్రితమే సారయ్య కాంగ్రెస్‌లో చేరుతారని భావించారు. అయితే ఆయనతో పాటు ఒకేసారి 10 మంది భారాస ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం, సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై సారయ్యను సంప్రదించగా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డితో చర్చించి ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని