నేడు ‘శక్తి’ కేంద్రాల్లో ‘మన్‌కీ బాత్‌’ వినిపించాలి

ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమాన్ని ఆదివారం అన్ని ‘శక్తి’ కేంద్రాల్లో వినిపించే ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు.

Published : 30 Jun 2024 05:28 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమాన్ని ఆదివారం అన్ని ‘శక్తి’ కేంద్రాల్లో వినిపించే ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 వేల శక్తి కేంద్రాల్లో ఈ ఏర్పాట్లను ఆయా జిల్లాల కార్యవర్గాలు పర్యవేక్షించాలని శనివారం ఆమె సూచించారు. రాజమహేంద్రవరంలో జులై 8న పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని