- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు (6)
నీట్పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు.
శాసనసభ సమావేశాల్లో నీట్పై తీర్మానం చేయాలి
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్
ఈనాడు, హైదరాబాద్: నీట్పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. ‘‘ఈ గందరగోళ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని విద్యార్థులు ఆందోళనగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నీట్ను రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నీట్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం యావత్ దేశానికే ఆదర్శనీయంగా నిలుస్తోంది. నీట్పై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి నీట్ రద్దు కోసం ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి’’ అని ఆయన సూచించారు.
ఎస్సీ వర్గీకరణ సాధనకు 7న నిరసన దీక్ష
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్
నల్లకుంట, న్యూస్టుడే: దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా జులై 7న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్(టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని పదేళ్లు గడిచినా భాజపా సర్కార్ నెరవేర్చలేదని ఆరోపించారు. పలు చరిత్రాత్మక బిల్లులను తీసుకొచ్చిన భాజపా ఎస్సీ వర్గీకరణపై వివక్ష చూపుతోందన్నారు. ఈ నిరసన దీక్షకు రాజకీయ, కులసంఘాల నేతలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
రైతులను ఆదుకోండి
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘రైతుబంధు డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా.. అని రైతులు ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ ఎవరెవరికి ఇస్తారన్నది స్పష్టతలేదు. సీఎం నియోజకవర్గం కొడంగల్లోనే నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. వాటిని అరికట్టే చర్యలేవీ?’’ అని ఈశ్వర్ ప్రశ్నించారు.
భాజపా పాలనలో ఆర్థిక అంతరాలు: నారాయణ
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్టుడే: పదేళ్ల భాజపా పాలనలో దేశంలో ఆర్థిక అంతరాలు పెరిగాయని, దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పరిస్థితి చావుతప్పి కన్నుపోయినట్లు అయిందని ఎద్దేవా చేశారు. బలమైన ప్రతిపక్షం లోక్సభలో ఉండటాన్ని సీపీఐ స్వాగతిస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, రుణమాఫీ, బొగ్గు బ్లాకుల వేలం అడ్డుకోవడం వంటి ప్రధాన అంశాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి అజీజ్పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
జైలులో పిన్నెల్లిని కలిసిన మాజీ మంత్రులు కాకాణి, అనిల్
నెల్లూరు(నేర విభాగం), న్యూస్టుడే: నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని శుక్రవారం మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ కలిశారు. తొలుత పిన్నెల్లి కుమారుడితోపాటు అనిల్ కుమార్, గంట తర్వాత కాకాణి ములాఖత్ అయ్యారు. దీంతో ఒక వారంలో రిమాండ్లో ఉన్న వారికి అందించే రెండు ములాఖత్లు పూర్తయ్యాయి. ఈ వారంలో ఇక పిన్నెల్లిని ఎవరూ కలిసే అవకాశం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
గతంలో పరదాల సీఎంను మనం చూశామని.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు -
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై లోకేశ్ ఘాటు స్పందన
జాతీయ పార్టీ నాయకుడైన మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. -
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: మాజీ మంత్రి బొత్స
ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదే తమ పార్టీ విధానమన్నారు. -
ప్రజా సమస్యలపై తెదేపా టోల్ఫ్రీ నంబరు 73062 99999
ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. -
పుంగనూరులో ఉద్రిక్తత
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన నేపథ్యంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
హస్తం గూటికి ఎమ్మెల్సీ సారయ్య!
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలిసింది. -
ఎ.కొండూరు ఎంపీపీ భర్తపై కేసు.. కేశినేని చిన్ని కారుపై రాళ్ల దాడి
విజయవాడ ప్రస్తుత తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కారుపై పోలింగ్ రోజున రాళ్లతో దాడి చేశారన్న ఫిర్యాదుపై ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడుకు చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త, వైకాపా మండల యువత అధ్యక్షుడు చెన్నారావు సహా పలువురిపై ఆదివారం కేసు నమోదైంది. ఆ వివరాలిలా ఉన్నాయి. -
విపక్ష నేత పదవి బలమైన ఆయుధం: రాహుల్
విపక్ష నేత పదవి అనేది భారతీయుల్లో ప్రతి ఒక్కరికీ బలమైన ప్రజాస్వామ్య ఆయుధమని, ఆ హోదాలో పార్లమెంటులో దేశ ప్రజల వాణిని తాను వినిపిస్తానని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చెప్పారు. -
సమాజ్వాదీ పార్టీకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వండి
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని సమాజ్వాదీ పార్టీ ఎంపీకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. -
కాంగ్రెస్, ఉద్ధవ్లతో కలిసే ఎన్నికలకు: శరద్పవార్
త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), కాంగ్రెస్తో కలిసే బరిలోకి దిగుతామని ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్పవార్ స్పష్టం చేశారు. -
భారాస బాటలోనే కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణలాంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారాస బాటలోనే నడుస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు కుట్రలు
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. -
పల్లె దవాఖానా ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ జెండాలు
కుమురంభీం జిల్లాలో మంత్రి సీతక్క ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రెబ్బెన మండలం నవేగాంలో నిర్మించిన పల్లె దవాఖానా ప్రారంభోత్సవ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిరసన వ్యక్తం చేశారు. -
కొత్త చట్టాలతో బాధితులకు అన్యాయం
మార్పు అంటే మంచి జరగాలని, కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. -
నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలి
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వారితో చర్చలు జరిపి న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. -
రాహుల్జీ.. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించండి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి కావచ్చినా.. ఇప్పటి వరకూ ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించలేదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. -
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
పశ్చిమబెంగాల్లో జరిగిన ఓ ఘటనపై ప్రతిపక్ష భాజపా, సీపీఎం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలన ఇలాగే ఉంటుందంటూ ఓ వీడియోను పోస్టు చేశాయి. -
కేరళ ఎయిమ్స్ తెచ్చిన చిచ్చు.. థరూర్, చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం
కేరళలో ఎయిమ్స్ ఏర్పాటుపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అసెంబ్లీలో చేసిన ప్రకటన నేపథ్యంలో తిరువనంతపురం ఎంపీ శశథరూర్, తాజా ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ మధ్య ‘ఎక్స్’ వేదికగా మాటల యుద్ధం చోటు చేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై లోకేశ్ ఘాటు స్పందన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM