సీపీఐ(ఎంఎల్‌) ఆధ్వర్యంలో 6న దేశవ్యాప్త నిరసనలు

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్నారని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ ఠాకూర్‌ విమర్శించారు.

Published : 28 Jun 2024 05:28 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్నారని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని మార్క్స్‌భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘దశాబ్దాలుగా భారతదేశం పాలస్తీనాను బలపరుస్తోంది. ఈ సంప్రదాయాన్ని కాదని ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపడం దారుణం. దీనికి వ్యతిరేకంగా జులై 6న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతాం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు