బీఎస్పీ అభ్యర్థికి శిరోమణి అకాలీదళ్‌ మద్దతు

పంజాబ్‌లోని జలంధర్‌ వెస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జులై 10న జరగనున్న ఉప ఎన్నికలో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) నేతలు వెల్లడించారు.

Published : 28 Jun 2024 05:08 IST

చండీగఢ్‌: పంజాబ్‌లోని జలంధర్‌ వెస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జులై 10న జరగనున్న ఉప ఎన్నికలో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) నేతలు వెల్లడించారు. ఇప్పటికే ఎస్‌ఏడీ బీ-ఫారం దక్కించుకున్న సుర్జీత్‌ కౌర్‌ను తాము బలపరచడం లేదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బాదల్‌ తప్పుకోవాలని కొందరు నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ రెబల్‌ వర్గ నేతలు ఎంపిక చేసిన అభ్యర్థి కావడంతోనే సుర్జీత్‌కు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు సైతం గడువు ముగియడంతో మరో దారి లేక పాత మిత్రపక్షమైన బీఎస్పీ అభ్యర్థికి జై కొట్టారు. ఎస్‌ఏడీ.. ఏ ఒక్కరి సొత్తూ కాదనీ, సిద్ధాంతాలే కీలకమని తిరుగుబాటు నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని