ఇకపై లిఫ్ట్‌లోనే రహస్య సమావేశాలు

మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులు, మాజీ ముఖ్యమంత్రులు ఉద్ధవ్‌ ఠాక్రే, దేవేంద్ర ఫడణవీస్‌లు విధాన భవన్‌లో గురువారం ఒకరికొకరు ఎదురుపడ్డారు.

Published : 28 Jun 2024 04:07 IST

ఫడణవీస్‌తో చర్చపై ఠాక్రే సరదా వ్యాఖ్య

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులు, మాజీ ముఖ్యమంత్రులు ఉద్ధవ్‌ ఠాక్రే, దేవేంద్ర ఫడణవీస్‌లు విధాన భవన్‌లో గురువారం ఒకరికొకరు ఎదురుపడ్డారు. లిఫ్ట్‌ కోసం వీరిద్దరూ కలిసి ఎదురుచూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ సమయంలో వారు ఒకరినొకరు పలకరించుకోవడంతో పాటు కొంతసేపు మాట్లాడుకున్నారు. దీనిపై ఉద్ధవ్‌ ఠాక్రేను మీడియా ప్రశ్నించగా.. ‘లిఫ్ట్‌కు చెవులుండవు. కాబట్టి, ఇక నుంచి రహస్య సమావేశాలన్నీ లిఫ్ట్‌లోనే పెట్టుకుంటాం’ అంటూ సరదాగా అన్నారు. ‘మేం అనుకోకుండా కలిశామంతే..!’’ అని తర్వాత స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని