- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
విపక్ష నేతగా రాహుల్కు గుర్తింపు
లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి స్పీకర్ ఓంబిర్లా గుర్తింపునిచ్చారు. ఈ మేరకు లోక్సభ సచివాలయం బుధవారం ప్రకటన (నోటిఫికేషన్) వెలువరించింది.
లోక్సభ సచివాలయం నోటిఫికేషన్
క్యాబినెట్ మంత్రి హోదాలో సదుపాయాలు
దిల్లీ: లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి స్పీకర్ ఓంబిర్లా గుర్తింపునిచ్చారు. ఈ మేరకు లోక్సభ సచివాలయం బుధవారం ప్రకటన (నోటిఫికేషన్) వెలువరించింది. ఈ నెల 9 నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. రాహుల్ విషయంలో కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మంగళవారం అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే. దిగువసభలో ప్రతిపక్ష నేత ఉండడం పదేళ్ల విరామం తర్వాత ఇదే మొదటిసారి. ఈ హోదా పొందడానికి అవసరమైన 10% సంఖ్యాబలం విపక్షాలకు లేకపోవడంతో 16, 17 లోక్సభల్లో ఎవరికీ ఇది లభించలేదు. తనకు ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు, కార్యకర్తలకు రాహుల్ ‘ఎక్స్’ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అన్ని చర్యల్లో ప్రభుత్వాన్ని జవాబుదారీని చేస్తామని పేర్కొన్నారు.
ప్రజల గొంతుక వినిపిస్తా
‘‘ఈ పదవి విషయంలో నాపై ఉంచిన నమ్మకానికి గానూ దేశ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇండియా కూటమి పక్షాలకు కృతజ్ఞతలు. వారందరి తరఫున పార్లమెంటులో వాణి వినిపిస్తాను. విపక్ష నేత అనేది ఒక పదవి మాత్రమే కాదు. ప్రజల ప్రయోజనాలు, హక్కుల్ని కాపాడేందుకు అదో పెద్ద బాధ్యత. ప్రజా సమస్యలు, అభిప్రాయాలను వారి తరఫున లోక్సభలో ప్రస్తావిస్తా’’ అని రాహుల్ ఒక వీడియో సందేశం వెలువరించారు. దళితులు, పేదలు, అణగారిన వర్గాలు, అల్పసంఖ్యాకులు, రైతులు, కార్మిక వర్గాల కోసం.. దాడుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించడం కోసం సర్వశక్తులొడ్డి పనిచేస్తానని హామీ ఇచ్చారు. సాధారణంగా టి-షర్టు, ప్యాంటుతో కనిపించే ఆయన.. బుధవారం విపక్షనేతగా సభకు తొలిసారి వచ్చినప్పుడు మాత్రం కుర్తా-పైజామా ధరించారు.
తొలిసారి రాజ్యాంగబద్ధ పదవి
రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో రాజ్యాంగబద్ధ పదవిని రాహుల్ చేపట్టడం ఇదే తొలిసారి. ఆయనకు ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా, దానికి తగ్గట్టు సదుపాయాలు, భద్రత లభిస్తాయి. లోక్పాల్, సీఈసీ/ ఎన్నికల కమిషనర్లు, సీబీఐ డైరెక్టర్, సీవీసీ, సీఐసీ వంటి కీలక పోస్టుల ఎంపిక సంఘాల్లో ఆయనొక సభ్యుడిగా ఉంటారు. లోక్సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట తొలిసీటు ఆయనకు కేటాయిస్తారు. ఒక ప్రైవేటు కార్యదర్శి, ఇద్దరు అదనపు పీఎస్లు, ఇద్దరు సహాయ పీఎస్లు, ఇద్దరు వ్యక్తిగత సహాయకులు, ఒక స్టెనో, ఒక గుమాస్తా, మరో ఐదుగురు ఇతర సిబ్బందిని ఆయనకు కేటాయిస్తారు. అద్దె లేకుండా పూర్తి సదుపాయాలతో నివాస గృహాన్ని వినియోగించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. -
పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల ఊపిరి పీల్చుకుంటోంది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత..నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారని, ప్రశాంతంగా నిద్రపోతున్నారని పల్నాడు జిల్లా తెదేపా నేతలు తెలిపారు. -
రాహుల్ మైక్ను మ్యూట్ చేశారు: కాంగ్రెస్
లోక్సభలో శుక్రవారం ‘నీట్ పేపర్ లీక్’ వ్యవహారాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తగానే మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. -
వైకాపాకు అలీ రాజీనామా
సినీనటుడు అలీ వైకాపాకు రాజీనామా చేశారు. ‘వైకాపానే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు, ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. -
పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: జగ్గారెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
భారాస చేజారిన నల్గొండ డీసీసీబీ పీఠం
నల్గొండ డీసీసీబీ పీఠం భారాస చేజారింది. భారాసకి చెందిన ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై కాంగ్రెస్తోపాటు సొంత పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది డైరెక్టర్లు 20 రోజుల క్రితం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. -
సంక్షిప్త వార్తలు (6)
నీట్పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. -
ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!
‘ఫలితాలు చూశాక.. షాక్ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలివి. -
ఒకరు పోతే పది మందిని తీర్చిదిద్దుకుందాం
పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఒకరుపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని భారాస అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. -
విరామం ఇస్తూ.. ఒక్కొక్కరిని చేర్చుకుంటూ..
వచ్చే నెలలో ఇతర పార్టీల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కొంత కొంత విరామం ఇస్తూ ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకునే విధానాన్ని పార్టీ అనుసరిస్తోంది. తాజాగా శుక్రవారం భారాసకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీలో కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై.. అక్రమ కేసులు తొలగించేందుకు కృషి
తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం