- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
AP news: ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజా సమస్యలపై పోరాడలేరా?
ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే ప్రజాసమస్యలపై పోరాడలేరా అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ను తెదేపా నేత సి.రామచంద్రయ్య, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రశ్నించారు.
జగన్పై సి.రామచంద్రయ్య, ఎమ్మెల్యే మాధవి ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే ప్రజాసమస్యలపై పోరాడలేరా అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ను తెదేపా నేత సి.రామచంద్రయ్య, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రశ్నించారు. లోక్సభలో ఎన్డీయే స్పీకర్ అభ్యర్థికి వైకాపా ఎంపీలు ఓటు వేయాలన్న నిర్ణయం వెనక ఆంతర్యం ఏంటో చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీలో వైకాపాను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ జగన్ స్పీకర్కు లేఖ రాయడం సిగ్గుచేటని మండిపడ్డారు. మొత్తం సభ్యుల్లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న విషయం జగన్కు తెలియకపోవడం బాధాకరమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సి.రామచంద్రయ్య బుధవారం ఓ ప్రకటన విడుదల చేయగా, మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మాధవి విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజాసమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించాలనే ఆలోచన నిజంగా జగన్కు ఉంటే ప్రతిపక్ష హోదా ఉందా.. లేదా.. అనేది విషయమే కాదు. అయ్యన్నపాత్రుడు స్పీకర్ కాకముందు చేసిన వ్యాఖ్యల్ని లేఖలో వక్రీకరించారు. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి రూల్ నంబర్ 56, క్లాజ్ నంబర్ ‘సీ’లో మొత్తం సభ్యుల్లో పది శాతం మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఉంది. ఆరుగురు సభ్యుల్ని లాగేస్తే తెదేపాకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని గతంలో జగన్ వ్యాఖ్యలు చేసిన విషయం మర్చిపోయారా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. -
పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల ఊపిరి పీల్చుకుంటోంది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత..నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారని, ప్రశాంతంగా నిద్రపోతున్నారని పల్నాడు జిల్లా తెదేపా నేతలు తెలిపారు. -
రాహుల్ మైక్ను మ్యూట్ చేశారు: కాంగ్రెస్
లోక్సభలో శుక్రవారం ‘నీట్ పేపర్ లీక్’ వ్యవహారాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తగానే మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. -
వైకాపాకు అలీ రాజీనామా
సినీనటుడు అలీ వైకాపాకు రాజీనామా చేశారు. ‘వైకాపానే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు, ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. -
పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: జగ్గారెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
భారాస చేజారిన నల్గొండ డీసీసీబీ పీఠం
నల్గొండ డీసీసీబీ పీఠం భారాస చేజారింది. భారాసకి చెందిన ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై కాంగ్రెస్తోపాటు సొంత పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది డైరెక్టర్లు 20 రోజుల క్రితం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. -
సంక్షిప్త వార్తలు (6)
నీట్పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. -
ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!
‘ఫలితాలు చూశాక.. షాక్ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలివి. -
ఒకరు పోతే పది మందిని తీర్చిదిద్దుకుందాం
పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఒకరుపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని భారాస అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. -
విరామం ఇస్తూ.. ఒక్కొక్కరిని చేర్చుకుంటూ..
వచ్చే నెలలో ఇతర పార్టీల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కొంత కొంత విరామం ఇస్తూ ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకునే విధానాన్ని పార్టీ అనుసరిస్తోంది. తాజాగా శుక్రవారం భారాసకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీలో కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై.. అక్రమ కేసులు తొలగించేందుకు కృషి
తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
-
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
-
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్లో ఐదుగురు జవాన్లు గల్లంతు
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
-
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్