భారాస మునిగిపోతున్న నావ: ఆది శ్రీనివాస్‌

భారాస మునిగిపోతున్న నావ అని.. అందులో ఎవరూ ఉండరని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌తో కలిసి ఆయన బుధవారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో మాట్లాడారు.

Published : 27 Jun 2024 03:39 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: భారాస మునిగిపోతున్న నావ అని.. అందులో ఎవరూ ఉండరని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌తో కలిసి ఆయన బుధవారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో భారాస ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించినప్పుడు కేసీఆర్‌ను ఎందుకు నిలదీయలేదని ఆయన ప్రశ్నించారు. 2019లో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను భారాసలో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఎటు పోయిందో చెప్పాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు ఆకర్షితులై భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వివాదం పార్టీ అంతర్గత విషయమని.. ఆయనపై సీఎం రేవంత్‌రెడ్డికి అమిత గౌరవం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని