- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
అవినీతిని మంత్రి పొన్నం పరోక్షంగా అంగీకరించినట్లే
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నీతిమంతుడైతే హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి ఎందుకు రాలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శలు
ఆలయం వద్ద ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి
ఫిలింనగర్, న్యూస్టుడే: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నీతిమంతుడైతే హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి ఎందుకు రాలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. అవినీతికి పాల్పడకపోతే ప్రమాణం చేయాలని మంత్రికి సవాల్ విసిరిన కౌశిక్రెడ్డి బుధవారం ఉదయం జూబ్లీహిల్స్లోని ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రి పొన్నం ప్రభాకర్ నా సవాల్ను స్వీకరించి ఫ్లైయాష్ రవాణాలో అవినీతికి పాల్పడలేదని ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తారని భావించాను. ఈ విషయంలో పొన్నం రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని నేను ఆరోపిస్తే ఆయన ఇప్పటివరకు పెదవి విప్పలేదు. దీనిపై ఆయన పంపిన లీగల్ నోటీసులకు భయపడేవారు ఎవరూ లేరు. నా సవాలును స్వీకరించలేదంటే అవినీతికి పాల్పడ్డానని ఆయన పరోక్షంగా అంగీకరించినట్లే. ఫ్లైయాష్ లారీలను స్వయంగా నేనే హుజూరాబాద్లో పట్టుకున్నా. అధికారులు, మంత్రులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. వారందరి వివరాలు బ్లాక్బుక్లో నమోదు చేస్తున్నా. మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తారు. అప్పుడు వారికి శిక్షలు తప్పవు. బ్లాక్బుక్లో మొట్టమొదటి పేరు పొన్నం ప్రభాకర్దే’’ అని కౌశిక్రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివెందుల వైకాపాలో పెండింగ్ బిల్లుల పంచాయితీ!
వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పెండింగ్ బిల్లులపై వైకాపా నాయకుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. -
ఏయూలో అక్రమాలను తవ్వి తీస్తాం
‘వైకాపా పాలనలో ఆంధ్రా విశ్వవిద్యాలయం సహా అనేక వర్సిటీల ప్రతిష్ఠ మసకబారింది. ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయి. -
వైకాపా నేతల చేతుల్లోకి పేదల భూములు
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైకాపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కోసమని చేపట్టిన భూసమీకరణలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. రైతులను మోసగించి రూ.కోట్ల విలువైన భూములను కొందరు తేలికగా కొట్టేశారు. -
నేడు ‘శక్తి’ కేంద్రాల్లో ‘మన్కీ బాత్’ వినిపించాలి
ప్రధాని మోదీ ‘మన్కీ బాత్’ కార్యక్రమాన్ని ఆదివారం అన్ని ‘శక్తి’ కేంద్రాల్లో వినిపించే ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. -
పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఎం
పోలవరం నిర్వాసితుల పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. -
మోదీ నైతికంగా ఓడిపోయారు
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా ఓడియారని, అయినా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా కొనసాగుతున్నారని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ విమర్శించారు. -
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఝార్ఖండ్లో భాజపా మాయం
హవాలా కేసులో తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నిన భాజపా.. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విమర్శించారు. -
భారాస హయాంలో రైతుబంధు దుర్వినియోగం: ఎమ్మెల్యే యెన్నం
భారాస ప్రభుత్వ హయాంలో 42 లక్షల ఎకరాలకు సంబంధించి రైతుబంధు దుర్వినియోగమైందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
కేసీఆర్పై మీరు వ్యతిరేక భావనతో ఉన్నట్లున్నారు
‘కేసీఆర్పైన, గత ప్రభుత్వంపైన మీరు వ్యతిరేక భావనతో ఉన్నట్టుగా, మా రాజకీయ ప్రత్యర్థులు చేసిన వాదనలతో మీరు ఏకీభవిస్తున్నట్టుగా మీ మాటల్లో స్పష్టమైంది. -
రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ
‘పేదల పొట్టకొట్టి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును ఎలా కబ్జా చేసిందో.. ఎలా వినియోగించుకుందో ఇన్నాళ్లూ విన్నాను. -
పేదల బియ్యంతో అక్రమాల సామ్రాజ్యం
పేదలకు పట్టెడన్నం పెట్టడానికి ప్రభుత్వం రూపాయికే కేజీ బియ్యం అందిస్తోంది. అందుకు కేజీకి రూ.39 ఖర్చుచేస్తోంది. ఇదే అదనుగా రేషన్ మాఫియా ఈ చౌకబియ్యాన్ని కొల్లగొడుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నా హార్ట్రేట్ పెరిగిపోయింది: వరల్డ్ కప్ విన్నింగ్పై ఎంఎస్ ధోనీ ఫస్ట్ రియాక్షన్
-
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
-
‘సుకన్య సమృద్ధి’కి ట్రైనీ అఖిల భారత సర్వీసు అధికారుల చొరవ.. 100 మంది పేరిట ఖాతాలు
-
ఆపద్బాంధవుడు బుమ్రా
-
జేఈఈ 8వ ర్యాంకర్కు రూ.1.60 కోట్ల పురస్కారం
-
నిజమే.. ఫైనల్ కోసం దాచుకున్నాడు