- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేసింది!
‘రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడటం తగదని’ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు.
భాజపా నేత లక్ష్మణ్
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవారితో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎన్.గౌతంరావు
బర్కత్పుర, న్యూస్టుడే: ‘రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడటం తగదని’ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన కొన్ని రాజకీయ పార్టీలు సైతం కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకడం దారుణమన్నారు. దీన్ని గురించి తెజస అధ్యక్షుడు కోదండరాం కూడా మాట్లాడటం లేదని పేర్కొన్నారు. భాజపా ఆధ్వర్యంలో మంగళవారం బర్కత్పురలోని నగర పార్టీ కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక సభ నిర్వహించారు. భాజపా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సమరయోధులను సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఎమర్జెన్సీపై కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల నేతలు నేటికీ పశ్చాత్తాపం ప్రకటించడం లేదన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి గెలిస్తే ఎన్నికలు ఉండవని, రిజర్వేషన్లు తొలగిస్తారని ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో ఫేక్ వీడియోల ద్వారా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందే తప్ప తొలగించదన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు బి.శ్యామ్సుందర్గౌడ్, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీపై పోరాడిన వెంకటరమణి, బొల్లంపల్లి మోహన్రెడ్డి, సురేశ్ లాహోటీ, రాంచందర్రావు, డాక్టర్ కంటు సత్యనారాయణలను సత్కరించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక సమావేశం నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
పులివెందులలోని మున్సిపల్ కౌన్సిలర్లతో వైకాపా ఎంపీ అవినాశ్రెడ్డి సమావేశం నిర్వహించారు. -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. -
రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారింది: నాదెండ్ల మనోహర్
రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పౌరసరఫరాల శాఖపై కాకినాడలో రెండో రోజు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. -
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. -
పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల ఊపిరి పీల్చుకుంటోంది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత..నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారని, ప్రశాంతంగా నిద్రపోతున్నారని పల్నాడు జిల్లా తెదేపా నేతలు తెలిపారు. -
రాహుల్ మైక్ను మ్యూట్ చేశారు: కాంగ్రెస్
లోక్సభలో శుక్రవారం ‘నీట్ పేపర్ లీక్’ వ్యవహారాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తగానే మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. -
వైకాపాకు అలీ రాజీనామా
సినీనటుడు అలీ వైకాపాకు రాజీనామా చేశారు. ‘వైకాపానే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు, ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. -
పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: జగ్గారెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
భారాస చేజారిన నల్గొండ డీసీసీబీ పీఠం
నల్గొండ డీసీసీబీ పీఠం భారాస చేజారింది. భారాసకి చెందిన ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై కాంగ్రెస్తోపాటు సొంత పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది డైరెక్టర్లు 20 రోజుల క్రితం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. -
సంక్షిప్త వార్తలు (6)
నీట్పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. -
ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!
‘ఫలితాలు చూశాక.. షాక్ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలివి. -
ఒకరు పోతే పది మందిని తీర్చిదిద్దుకుందాం
పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఒకరుపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని భారాస అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. -
విరామం ఇస్తూ.. ఒక్కొక్కరిని చేర్చుకుంటూ..
వచ్చే నెలలో ఇతర పార్టీల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కొంత కొంత విరామం ఇస్తూ ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకునే విధానాన్ని పార్టీ అనుసరిస్తోంది. తాజాగా శుక్రవారం భారాసకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీలో కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై.. అక్రమ కేసులు తొలగించేందుకు కృషి
తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మ్యాచ్ను ‘బ్రాడ్కాస్టింగ్’ గెలిపించదు కదా..: మైకెల్ వాన్కు గంగూలీ కౌంటర్
-
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల లేటెస్ట్ ధరలు ఇవే..
-
ఏఐ వాయిస్తో లేడీ మాయ.. మహిళ నుంచి రూ.6 లక్షలు దోపిడీ
-
ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం
-
విజయవాడ-జగదల్పూర్ హైవేలో మార్పులు కోరాం: మంత్రి తుమ్మల
-
కాలుకు గాయం.. బాలుడి మర్మావయవాలకు సర్జరీ!