- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
పరస్పర సవాళ్లతో హుజూరాబాద్లో ఉద్రిక్తత
కాంగ్రెస్, భారాస నేతల పరస్పర సవాళ్లతో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రణవ్ల గృహ నిర్బంధం
హుజూరాబాద్ గ్రామీణం, వీణవంక, న్యూస్టుడే: కాంగ్రెస్, భారాస నేతల పరస్పర సవాళ్లతో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీపీసీ బూడిద రవాణా విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డారంటూ కొద్ది రోజులుగా ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మంత్రి జూబ్లీహిల్స్లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే మూడు రోజుల కిందట సవాల్ విసిరారు. కాగా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి డబ్బులు తీసుకొన్నారని కాంగ్రెస్ హుజూరాబాద్ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ సోమవారం ఆరోపించారు. దీనిపై హుజూరాబాద్ మండలం చెల్పూరు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఆ సవాల్ను ఎమ్మెల్యే స్వీకరించి మంగళవారం ఉదయం వస్తానని ప్రకటించారు. దీంతో ప్రణవ్ను, కౌశిక్రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే తన వద్ద డబ్బులు తీసుకొన్నారని చెల్పూరు మాజీ సర్పంచి మహేందర్గౌడ్ ఆలయం వద్ద ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేయగా ఇద్దరు గాయపడ్డారు. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వీణవంకలోని నివాసంలో తడి బట్టలతో హనుమాన్ చిత్రపటంతో ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నేత ప్రణవ్ హుజూరాబాద్ మండలం సింగాపూర్లోని తన నివాసంలో మాట్లాడుతూ దేవుడిపై ఒట్టేసి అబద్ధాలు ఆడటం ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికే చెల్లుతుందని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. -
పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల ఊపిరి పీల్చుకుంటోంది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత..నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారని, ప్రశాంతంగా నిద్రపోతున్నారని పల్నాడు జిల్లా తెదేపా నేతలు తెలిపారు. -
రాహుల్ మైక్ను మ్యూట్ చేశారు: కాంగ్రెస్
లోక్సభలో శుక్రవారం ‘నీట్ పేపర్ లీక్’ వ్యవహారాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తగానే మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. -
వైకాపాకు అలీ రాజీనామా
సినీనటుడు అలీ వైకాపాకు రాజీనామా చేశారు. ‘వైకాపానే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు, ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. -
పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: జగ్గారెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
భారాస చేజారిన నల్గొండ డీసీసీబీ పీఠం
నల్గొండ డీసీసీబీ పీఠం భారాస చేజారింది. భారాసకి చెందిన ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై కాంగ్రెస్తోపాటు సొంత పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది డైరెక్టర్లు 20 రోజుల క్రితం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. -
సంక్షిప్త వార్తలు (6)
నీట్పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. -
ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!
‘ఫలితాలు చూశాక.. షాక్ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలివి. -
ఒకరు పోతే పది మందిని తీర్చిదిద్దుకుందాం
పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఒకరుపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని భారాస అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. -
విరామం ఇస్తూ.. ఒక్కొక్కరిని చేర్చుకుంటూ..
వచ్చే నెలలో ఇతర పార్టీల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కొంత కొంత విరామం ఇస్తూ ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకునే విధానాన్ని పార్టీ అనుసరిస్తోంది. తాజాగా శుక్రవారం భారాసకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీలో కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై.. అక్రమ కేసులు తొలగించేందుకు కృషి
తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
-
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్..
-
చంద్రబాబు కార్యసాధకుడు.. అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు: సుమన్