- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
నాడు ఎమర్జెన్సీ విధించి నేడు రాజ్యాంగంపై నాటకాలా?
దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి, పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాలరాసి.. రాజ్యాంగాన్ని అణగదొక్కినవారికి రాజ్యాంగంపై ప్రేమ నాటకాలాడే హక్కు లేదని ప్రధాని నరేంద్రమోదీ ఆక్షేపించారు.
ఆనాటి తత్వం ఆ నేతల్లో సజీవంగానే ఉంది
‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్పై విరుచుకుపడ్డ మోదీ
దిల్లీ: దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి, పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాలరాసి.. రాజ్యాంగాన్ని అణగదొక్కినవారికి రాజ్యాంగంపై ప్రేమ నాటకాలాడే హక్కు లేదని ప్రధాని నరేంద్రమోదీ ఆక్షేపించారు. 26.6.1975న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి మంగళవారానికి 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ మేరకు ‘ఎక్స్’లో వరస పోస్ట్లతో స్పందించారు. ‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ఆనాడు ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ హరించింది. అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి ప్రభుత్వం యావద్దేశాన్నీ జైలుగా మార్చింది. వ్యతిరేకించిన వారిని వేధించి, హింసించారు. దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చారు’’ అని మోదీ గుర్తుచేశారు. ‘‘లెక్కకు మిక్కిలిగా 356 అధికరణాన్ని (రాష్ట్రపతి పాలన విధింపు) రాష్ట్రాలపై ప్రయోగించారు. పత్రికా స్వేచ్ఛకు కళ్లెం వేయడానికి ఎన్నో బిల్లులు తీసుకొచ్చారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారు. నాటి సంకుచిత, కుటిల మనస్తత్వం ఆ పార్టీ నేతల్లో ఇంకా సజీవంగానే ఉంది. రాజ్యాంగంపై తమకున్న తిరస్కారభావాన్ని దాచిపెట్టి వారెంతగా నటిస్తున్నా ప్రజలు అర్థం చేసుకుని తిరస్కరించారు’’ అంటూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఎద్దేవా చేశారు.
స్వీయ వైఫల్యాలు దాచుకునేందుకే ఎమర్జెన్సీపై మోదీ వ్యాఖ్యలు
-ఖర్గే
స్వీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రధాని మోదీ- ఎమర్జెన్సీపై విమర్శలు చేస్తూ పాత చరిత్రను తిరగదోడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో విమర్శించారు. ‘‘ఏకాభిప్రాయం, సహకారం గురించి చెప్పే మోదీ.. దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను దొడ్డిదారిన పడదోయడం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, సీఎంలను జైళ్లకు పంపించడం.. ఇదంతా అప్రకటిత ఎమర్జెన్సీ కాదా? 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు ఏకాభిప్రాయం ఏమైంది? నోట్లరద్దు, లాక్డౌన్, ఎన్నికల బాండ్లు వంటి అంశాల్లో అది ఎక్కడకు పోయింది?’’ అని ప్రశ్నించారు. పార్లమెంటులో అనేక బిల్లులను గంటలోనే ఆమోదించారని గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుండగా వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. -
పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల ఊపిరి పీల్చుకుంటోంది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత..నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారని, ప్రశాంతంగా నిద్రపోతున్నారని పల్నాడు జిల్లా తెదేపా నేతలు తెలిపారు. -
రాహుల్ మైక్ను మ్యూట్ చేశారు: కాంగ్రెస్
లోక్సభలో శుక్రవారం ‘నీట్ పేపర్ లీక్’ వ్యవహారాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తగానే మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. -
వైకాపాకు అలీ రాజీనామా
సినీనటుడు అలీ వైకాపాకు రాజీనామా చేశారు. ‘వైకాపానే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు, ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. -
పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: జగ్గారెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
భారాస చేజారిన నల్గొండ డీసీసీబీ పీఠం
నల్గొండ డీసీసీబీ పీఠం భారాస చేజారింది. భారాసకి చెందిన ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై కాంగ్రెస్తోపాటు సొంత పార్టీకి చెందిన వారు మొత్తం 14 మంది డైరెక్టర్లు 20 రోజుల క్రితం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. -
సంక్షిప్త వార్తలు (6)
నీట్పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. -
ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!
‘ఫలితాలు చూశాక.. షాక్ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలివి. -
ఒకరు పోతే పది మందిని తీర్చిదిద్దుకుందాం
పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఒకరుపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని భారాస అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. -
విరామం ఇస్తూ.. ఒక్కొక్కరిని చేర్చుకుంటూ..
వచ్చే నెలలో ఇతర పార్టీల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కొంత కొంత విరామం ఇస్తూ ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకునే విధానాన్ని పార్టీ అనుసరిస్తోంది. తాజాగా శుక్రవారం భారాసకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీలో కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై.. అక్రమ కేసులు తొలగించేందుకు కృషి
తెదేపా కార్యకర్తలపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త
-
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
-
రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని ఆందోళన