- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
పవన్ శక్తి... వర్మ యుక్తి
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ను పిఠాపురంలో ఎలాగైనా ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నా... అందుకు దీటైన వ్యూహంతో జనసేనాధిపతి విజయం సాధించారు.
లోకల్ ఎజెండాతో ఆకట్టుకున్న జనసేన అధినేత
పిఠాపురంలో కలిసి కదిలిన మూడు పార్టీలు
ఈనాడు, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ను పిఠాపురంలో ఎలాగైనా ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నా... అందుకు దీటైన వ్యూహంతో జనసేనాధిపతి విజయం సాధించారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయమై మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగింది. చివరకు దత్తాత్రేయ జన్మస్థలమైన పిఠాపురాన్ని ఆయన ఎంచుకున్నారు. అక్కడ తెదేపా అభ్యర్థిత్వం ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ అప్పటికే పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దాంతో సాక్షాత్తూ తెదేపా అధినేత చంద్రబాబు జోక్యం చేసుకుని వర్మతో మాట్లాడి ఒప్పించారు. పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న వర్మ... పవన్కల్యాణ్ తరఫున ప్రచారంతోపాటు పోలింగు నిర్వహణలోనూ కీలకపాత్ర పోషించారు. జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు ఒక్కటై పనిచేయడం, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగడంతోపాటు సామాజిక సమీకరణాలూ కలిసి రావడంతో పవన్కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం అందుకున్నారు.
అక్కడే మకాం... జనంతో మమేకం
ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత పవన్కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోనే మకాం చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గృహ ప్రవేశం చేసి, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. ఈ నివాసంలోనే ఉగాది వేడుకలనూ జరుపుకొన్నారు. అక్కడి నుంచే రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ప్రచారానికి వెళ్లి వచ్చారు. మధ్యలో రోడ్షోలతో ప్రజలతో మమేకమవుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. స్థానిక ఎజెండాతో జనం ముందుకొచ్చారు. పిఠాపురం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని, ఉప్పాడను ఏళ్లుగా వేధిస్తున్న సముద్రం కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని, ఏలేరు, సుద్దగడ్డ జలాశయాలను ఆధునీకరిస్తామని, పిఠాపురాన్ని సీడ్ హబ్గా మార్చడంతోపాటు సెరీ, హర్టీకల్చర్ రైతులను ఆదుకుంటామన్నారు. పట్టు రైతులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. రైతులను రోడ్డున పడేసిన ఎస్ఈజెడ్లో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గొల్లప్రోలు సంతను అభివృద్ధి చేస్తానన్నారు. ఇలా పలు హామీలతో కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు చేరువయ్యారు. నియోజకవర్గంలోని రెండు పట్టణాలు, 52 గ్రామాల ప్రజలకు చేరువయ్యేలా రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహించారు.
వర్మ కుటుంబ సభ్యులకూ ప్రాధాన్యం
మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్కల్యాణ్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ప్రతి పర్యటనలోనూ ఇద్దరూ కలిసే పాల్గొనడంతో రెండు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం సాధ్యపడింది. పవన్కల్యాణ్ సైతం వర్మతోపాటు ఆయన కుటుంబ సభ్యులకూ అత్యంత ప్రాధాన్యమిచ్చారు. పిఠాపురంలో వర్మ ప్రాధాన్యాన్ని అడుగడుగునా ప్రస్తావించారు. జనసేన ప్రధాన కార్యదర్శి, పవన్ సోదరుడు కొణిదెల నాగబాబు సైతం ఇక్కడే మకాం చేసి అన్ని వ్యవహారాలూ స్వయంగా చూసుకున్నారు. మరోవైపు జగన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. పవన్కల్యాణ్ను ఓడించే బాధ్యతలను మిథున్రెడ్డికి అప్పగించారు. మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అన్ని ప్రాంతాలకు వైకాపా సీనియర్ నాయకులను ఇన్ఛార్జులుగా నియమించి, పర్యవేక్షించారు. ఆఖరికి చివరిరోజు వైకాపా అభ్యర్థి వంగా గీత గెలిస్తే ఉప ముఖ్యమంత్రిని చేస్తానని కూడా జగన్ ప్రకటించారు. ఇవేమీ పవన్కల్యాణ్ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. నాగబాబు భార్య పద్మజ, కుమారుడు వరుణ్ తేజ్, మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, జనసేన స్టార్ క్యాంపెయినర్లు జానీ మాస్టర్, హైపర్ ఆది, శ్రీను, జబర్దస్త్ టీం సభ్యులు ప్రచారంలో పాల్గొని జోష్ నింపారు. పవన్కల్యాణ్కు మద్దతుగా చిరంజీవి సతీమణి సురేఖ, తనయుడు రామ్చరణ్ పిఠాపురం రావడం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు నాయకుడు.. జగన్ ప్రతినాయకుడు
రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు దిల్లీ వెళితే.. హింసా రాజకీయాల్ని ప్రోత్సహించే వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్లారని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. -
అసెంబ్లీకి ఐదేళ్లలో సున్నం కూడా వేయలేదు
వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని నాశనం చేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరం కలసి మంచి రాజధానిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు హైదరాబాద్లో ఘనస్వాగతం
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. -
చిత్తూరులో వైకాపాకు భారీ షాక్
వైకాపాకు చిత్తూరులో భారీ షాక్ తగిలింది. నగర మేయర్ ఎస్.అముద ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
దర్శి వైకాపా ఎమ్మెల్యే హల్చల్
అధికార అండతో ఇన్నాళ్లూ దౌర్జన్యాలకు పాల్పడిన వైకాపా నాయకులు ఇప్పుడు కూడా అదే మార్గంలో వెళుతున్నారు. -
సొంత బాబాయ్ చనిపోయినా.. జగన్ ఇంతలా స్పందించలేదు
తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే పట్టించుకోని జగన్.. ఈవీఎం పగలగొట్టి, సీఐ హత్యకు యత్నించి జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో వెళ్లడం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. -
భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చితి ఏర్పడకుండా చూడాలి: సీపీఎం
రాజధాని అమరావతిపై భవిష్యత్తులో అనిశ్చితి, గందరగోళం ఏర్పడకుండా వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. -
ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
లోక్సభ హౌస్ కమిటీలో పురందేశ్వరికి చోటు
ఎంపీల వసతి, ఇతర సదుపాయాలను పర్యవేక్షించే లోక్సభ హౌస్ కమిటీ ఏర్పాటైంది. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్ శర్మ నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో 12 మంది సభ్యులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. -
పిన్నెల్లి వాసుల సమస్యపై కోర్టుకు వెళ్దాం
గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలప్పటి నుంచి పరిస్థితి కుదుటపడలేదని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్కు తెలిపారు. -
8న రాజమహేంద్రవరంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
రాజమహేంద్రవరంలో ఈ నెల 8న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు. -
ఓటమిపై కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు
మాజీ సీఎం, భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
భారాస అధికారిక సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. -
కేశవరావు రాజీనామాకు ఆమోదం
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చేసిన రాజీనామాను ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ శుక్రవారం ఆమోదించారు. -
తెలంగాణ దాటితే కేసీఆర్ను ఎవరూ గుర్తుపట్టరు
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో కూర్చొని ఆ పార్టీ శ్రేణులకు పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన స్పీకర్
ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే విషయమై దాదాపు నెల రోజులుగా పశ్చిమబెంగాల్ రాజ్భవన్, ఆ రాష్ట్ర శాసనసభ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో వివాదం తలెత్తింది. -
హాథ్రస్పై రాజకీయం చేయను
దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్ తొక్కిసలాటపై తాను రాజకీయాలు చేయదలచుకోవడం లేదని, కానీ తప్పు రాష్ట్ర అధికార యంత్రాంగానిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నెల రోజుల్లో మోదీ ప్రభుత్వ పతనం
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, నెల రోజుల్లోపే అది కుప్పకూలడం ఖాయమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ అన్నారు. -
మండలి హస్తగతమే లక్ష్యం
తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దు
గద్వాల భారాస ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం గాంధీభవన్లో ఆందోళనకు దిగారు. -
పవన్కల్యాణ్ వల్లే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం: జగ్గారెడ్డి
జనసేన అధినేత పవన్కల్యాణ్ తెదేపాతో భాజపాకు పొత్తు కుదర్చకపోతే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చేది కాదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
-
నిఖత్కు సాటిలేరు.. ఒలింపిక్స్ బరిలో ఇందూరు బాక్సర్
-
గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది అధికారులు
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
-
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?