- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఎన్డీయేలో చంద్రబాబు, నీతీశ్లే కీలకం!
కేంద్రంలో భాజపా నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమిలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జేడీయూ అగ్రనేత నీతీశ్కుమార్లు కీలకం కానున్నారు.
ఈనాడు, దిల్లీ: కేంద్రంలో భాజపా నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమిలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జేడీయూ అగ్రనేత నీతీశ్కుమార్లు కీలకం కానున్నారు. భాజపా ఈ ఎన్నికల్లో సొంతంగా 272 మెజార్టీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతి పెద్ద పార్టీలైన తెదేపా, జేడీయూలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కు మేలుచేసే అవకాశం ఉంది. చంద్రబాబు, నీతీశ్లు గతంలో ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నా రాజకీయ వైరుద్ధ్యాల కారణంగా బయటికి వచ్చి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే తిరిగి కలిశారు. బిహార్లో భాజపాది పెద్దన్న పాత్ర అయితే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఆ స్థానంలో ఉంది. అయినప్పటికీ పరస్పర అవగాహనతో ఆయాపార్టీలకు స్థానికంగా ఉన్న బలాబలాల ఆధారంగా సీట్లు సర్దుబాటుచేసుకొని ఎన్నికల గోదాలో దిగాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో తెదేపా, భాజపా రెండూ లాభపడగా, బిహార్లోనూ అదే పరిస్థితి. ప్రస్తుతం ఎన్డీయేలో భాజపా తర్వాత అతి పెద్ద పార్టీలుగా 16 సీట్లతో తెలుగుదేశం, 12 సీట్లతో జేడీయూలు నిలిచాయి. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు అవసరం. ఈ రాజకీయబలాన్ని ఉపయోగించుకొని వారు తమ సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వపరంగా మేలు చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.
నాడు వాజ్పేయీ హయాంలోనూ.
1999లో వాజ్పేయీ నేతృత్వంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలోనూ చంద్రబాబునాయుడు కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన తన రాజకీయపలుకుబడిని ఉపయోగించి హైదరాబాద్కు అంతర్జాతీయ విమానాశ్రయం, ఎంఎంటీస్, హైవేలు తీసుకురాగలిగారు. గత అయిదేళ్ల జగన్ పాలనలో అభివృద్ధికి దూరమైన ఆంధ్రప్రదేశ్ను సరిదిద్దడానికి, పోలవరం, అమరావతిలాంటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చంద్రబాబునాయుడికి ఉపయోగపడే అవకాశం ఉంది. 2014 నుంచి 2018 వరకు ఆయన ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంవల్లే విభజన చట్టంలోని జాతీయ విద్యాసంస్థలు, పోలవరం నిర్మాణాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్లగలిగారు. 1999లో వాజ్పేయీ హయాంలో తెదేపా ఎన్డీయే భాగస్వామిగా ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చేరలేదు. 2014లో మాత్రం పార్టీ సీనియర్ నేతలు అశోక్గజపతిరాజు, సుజనాచౌదరిలకు మంత్రివర్గంలో చేరారు. ప్రత్యేకహోదా అంశంలో విభేదించి 2018 మార్చిలో ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చినప్పుడు రాజీనామా చేశారు తప్పితే అప్పటివరకు వారిద్దరూ కేంద్రంలో సఖ్యతతో పనిచేశారు.
రాష్ట్రానికి మేలు
మోదీ ప్రభుత్వంలో అశోక్గజపతిరాజు పౌరవిమానయానశాఖ మంత్రిగా ఉన్నప్పుడే భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు వచ్చాయి. కర్నూలు ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయింది. విజయవాడ ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్టుల విస్తరణ పనులు మొదలయ్యాయి. ఆర్సీఎస్ ఉడాన్ పథకం కింద కర్నూలు, కడప విమానాశ్రయాల నుంచి రాకపోకలు మొదలయ్యాయి. మరోవైపు సుజనాచౌదరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ విభజన చట్టంలో చెప్పిన కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల ఏర్పాటు, నిధుల విడుదల తదితర వ్యవహారాలు చూశారు. ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉండటంతో అమరావతి, గుంటూరు, విజయవాడల అభివృద్దికి కేంద్రపట్టణాభివృద్ధిశాఖ ద్వారా సుమారు రూ.2,500 కోట్లు విడుదల చేశారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలను స్మార్ట్సిటీలుగా ప్రకటించి నిధులు విడుదల చేయించారు. ఒక్క ప్రత్యేక హోదా అంశం మినహాయిస్తే మిగిలిన పనులు 2014-18 మధ్యకాలంలో కొంత వేగంగానే సాగాయి. కానీ గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకంటే ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో కొత్త ప్రాజెక్టులేవీ రాలేదు. ఇప్పుడు చంద్రబాబునాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఆలంబనగా చేసుకొని ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడంతోపాటు, కొత్త వాటిని రాష్ట్రానికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు నాయకుడు.. జగన్ ప్రతినాయకుడు
రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు దిల్లీ వెళితే.. హింసా రాజకీయాల్ని ప్రోత్సహించే వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్లారని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. -
అసెంబ్లీకి ఐదేళ్లలో సున్నం కూడా వేయలేదు
వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని నాశనం చేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరం కలసి మంచి రాజధానిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు హైదరాబాద్లో ఘనస్వాగతం
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. -
చిత్తూరులో వైకాపాకు భారీ షాక్
వైకాపాకు చిత్తూరులో భారీ షాక్ తగిలింది. నగర మేయర్ ఎస్.అముద ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసి తెదేపాలో చేరారు. -
దర్శి వైకాపా ఎమ్మెల్యే హల్చల్
అధికార అండతో ఇన్నాళ్లూ దౌర్జన్యాలకు పాల్పడిన వైకాపా నాయకులు ఇప్పుడు కూడా అదే మార్గంలో వెళుతున్నారు. -
సొంత బాబాయ్ చనిపోయినా.. జగన్ ఇంతలా స్పందించలేదు
తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే పట్టించుకోని జగన్.. ఈవీఎం పగలగొట్టి, సీఐ హత్యకు యత్నించి జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లో వెళ్లడం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. -
భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చితి ఏర్పడకుండా చూడాలి: సీపీఎం
రాజధాని అమరావతిపై భవిష్యత్తులో అనిశ్చితి, గందరగోళం ఏర్పడకుండా వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. -
ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
లోక్సభ హౌస్ కమిటీలో పురందేశ్వరికి చోటు
ఎంపీల వసతి, ఇతర సదుపాయాలను పర్యవేక్షించే లోక్సభ హౌస్ కమిటీ ఏర్పాటైంది. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్ శర్మ నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో 12 మంది సభ్యులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. -
పిన్నెల్లి వాసుల సమస్యపై కోర్టుకు వెళ్దాం
గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలప్పటి నుంచి పరిస్థితి కుదుటపడలేదని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్కు తెలిపారు. -
8న రాజమహేంద్రవరంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
రాజమహేంద్రవరంలో ఈ నెల 8న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు. -
ఓటమిపై కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు
మాజీ సీఎం, భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
భారాస అధికారిక సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. -
కేశవరావు రాజీనామాకు ఆమోదం
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చేసిన రాజీనామాను ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ శుక్రవారం ఆమోదించారు. -
తెలంగాణ దాటితే కేసీఆర్ను ఎవరూ గుర్తుపట్టరు
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో కూర్చొని ఆ పార్టీ శ్రేణులకు పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన స్పీకర్
ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే విషయమై దాదాపు నెల రోజులుగా పశ్చిమబెంగాల్ రాజ్భవన్, ఆ రాష్ట్ర శాసనసభ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో వివాదం తలెత్తింది. -
హాథ్రస్పై రాజకీయం చేయను
దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్ తొక్కిసలాటపై తాను రాజకీయాలు చేయదలచుకోవడం లేదని, కానీ తప్పు రాష్ట్ర అధికార యంత్రాంగానిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నెల రోజుల్లో మోదీ ప్రభుత్వ పతనం
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, నెల రోజుల్లోపే అది కుప్పకూలడం ఖాయమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ అన్నారు. -
మండలి హస్తగతమే లక్ష్యం
తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దు
గద్వాల భారాస ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం గాంధీభవన్లో ఆందోళనకు దిగారు. -
పవన్కల్యాణ్ వల్లే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం: జగ్గారెడ్డి
జనసేన అధినేత పవన్కల్యాణ్ తెదేపాతో భాజపాకు పొత్తు కుదర్చకపోతే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చేది కాదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.