- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఈ చాయ్వాలా అదృష్టం ఎలా ఉందో!
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో టీకొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆనంద్సింగ్ కుశ్వాహా 28వ ప్రయత్నంగా తాజా ఎన్నికల్లో తన నామినేషను వేశారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో టీకొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆనంద్సింగ్ కుశ్వాహా 28వ ప్రయత్నంగా తాజా ఎన్నికల్లో తన నామినేషను వేశారు. 1994 మొదలు పురపాలక, లోక్సభ, అసెంబ్లీ.. ఇలా ప్రతి ఎన్నికలోనూ బరిలోకి దిగుతున్న ఈయన ప్రస్తుత పోటీలో బీఎస్పీ అభ్యర్థిగా గ్వాలియర్ తూర్పు నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తలకు టోపీ నుంచి కాళ్లకు వేసుకున్న జోళ్ల దాకా మొత్తం నీలిరంగు (బీఎస్పీ రంగు) ఆహార్యంతో సైకిలుపై గురువారం కలెక్టరేటుకు చేరుకొన్న ఆనంద్సింగ్ ఉత్సాహంగా నామినేషను పత్రాలు దాఖలు చేశారు. ‘‘చాయ్ అమ్మిన వ్యక్తి ఈ దేశానికి ప్రధాని అయ్యారు. నేను ఎంపీ లేదా ఎమ్మెల్యే కాలేనా? ఏదో ఒకరోజు తప్పక ఎన్నికవుతాను’’ అంటారాయన. ‘ఈటీవీ భారత్’తో ఆనంద్సింగ్ మాట్లాడుతూ..‘‘గతంలో మా వర్గానికి చెందిన రాష్ట్ర మాజీ మంత్రి నారాయణసింగ్ కుశ్వాహాతో కౌన్సిలరు ఎన్నిక విషయంలో పోటీ పడ్డాను. ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయినా, ప్రతి ఎన్నికలోనూ పోటీ చేయాలని ఆరోజే నిర్ణయించుకున్నా’’ అని తన సంకల్పాన్ని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్ అయ్యన్న
ఐదేళ్లు పాలించిన వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వేయలేదని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. -
కేసీఆర్పై విశ్వాసం లేకే కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
భారాస అధ్యక్షుడు కేసీఆర్పై విశ్వాసం లేకపోవడంతోనే ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. -
కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఆయన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. -
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను గత ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. -
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస విద్యార్థి నేతల ఆందోళన.. పలువురి అరెస్టు
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస అనుబంధ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. రహదారిపై బైఠాయించి అనుబంధ విద్యార్థి సంఘం నేతలు నిరసన తెలిపారు. -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. -
ఆడిన మాట తప్పని రాజస్థాన్ మంత్రి కిరోడిలాల్
భాజపా సీనియర్ నేత, రాజస్థాన్ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి కిరోడి లాల్ మీనా (72) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆమోదించలేదు. -
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు
కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైనా కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్లో గురువారం కేసు నమోదుచేశారు. -
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల నిర్వాహకులేనని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. -
‘ఆమెను రాజమాత అని మీరెందుకు తిట్టారు? అక్కడి నుంచే పార్టీ నాశనం’
‘అంతా మీరే చేశారు’ ఇది ఒక సినిమాలోని పాపులర్ డైలాగు. ఇప్పుడదే డైలాగును వైకాపాలో తాజా మాజీలు ఒకరిపై ఒకరు గట్టిగానే ప్రయోగించుకున్నారు. -
భారాసకు భారీ షాక్
భారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. -
పిన్నెల్లి మంచోడు...
‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు.. కాబట్టే 2009 నుంచి 2019 వరకు నాలుగుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు ఆయన్ను దీవించారు. -
ప్రజాతీర్పునకు వక్రభాష్యాలా..?
ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా.. జగన్లో మార్పు రాలేదు. ప్రజాతీర్పును గౌరవించేందుకు ఆయన ఇంకా సిద్ధపడలేదు. ఓటమిని అంగీకరించక, రోజుకో మాట చెబుతూనే ఉన్నారు. -
ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం నేరాలు కావా?
పోలింగ్ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో భారీ విధ్వంసం సృష్టించి, ఈవీఎంలను ధ్వంసం చేసి, అడ్డుకోబోయిన సీఐపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకూడదా అని వైకాపా అధినేత జగన్ను తెదేపా నేతలు ప్రశ్నించారు. -
ముగ్గురాయి గనుల్లో అక్రమాలు.. ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల నష్టం
మంగంపేట ముగ్గురాయి గనుల్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఆరోపించారు. -
ప్రజాతీర్పు శిరోధార్యం
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, వారి తీర్పే శిరోధార్యమని, వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. -
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ విఫలం: కేటీఆర్
రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే రాహుల్ గాంధీ దాని స్ఫూర్తిని కాపాడడంలో విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా
భారాసను వీడి కాంగ్రెస్లో చేరిన కె.కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. -
సంక్షిప్త వార్తలు (5)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు ఈ నెల 6న భేటీ కావడం హర్షణీయమని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి అన్నారు. -
ఫోన్ట్యాపింగ్తో సంబంధం లేదు: ఎమ్మెల్సీ నవీన్కుమార్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని భారాస ఎమ్మెల్సీ కె.నవీన్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించేందుకు ఎవరు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. -
10న తెలంగాణకు కాంగ్రెస్ కురియన్ కమిటీ
లోక్సభ ఎన్నికల్లో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించకపోవడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈ నెల 10న తెలంగాణకు రానుంది.
తాజా వార్తలు (Latest News)
-
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
-
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!
-
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
-
వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్ అయ్యన్న
-
నటుడు రాజ్ తరుణ్పై యువతి ఫిర్యాదు