Dwarampudi: కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల వీరంగం

కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు.

Updated : 02 Jul 2024 19:52 IST

కాకినాడ (సాంబమూర్తి నగర్‌): కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. కాకినాడ గుడారిగుంటలో ద్వారంపూడి ప్రధాన అనుచరుడైన బల్లా సూరిబాబు రెండు అంతస్తుల భవనం నిర్మించారు. అనుమతి లేకుండా ఈ నిర్మాణం చేపట్టినట్లు నగర పాలక టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు గుర్తించి అక్కడికి వచ్చారు. దీంతో పోలీసులు, అధికారులు.. ద్వారంపూడి అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ద్వారంపూడి కూడా ఘటనా స్థలికి చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, మాజీ ఎమ్మెల్యే కాసేపు చర్చలు జరిపారు. అనంతరం అక్కడి నుంచి ద్వారంపూడి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బల్లారి సూరిబాబు.. తెదేపా నాయకులను తీవ్రమైన పదజాలంతో దూషించారు. వచ్చేది మా ప్రభుత్వమే అంతు చూస్తానంటూ  వీరంగం వేశారు. స్పెషల్‌ పోలీసులు కూడా రంగంలోకి దిగి ద్వారంపూడి అనుచరులను అక్కడి నుంచి చెదరగొట్టారు. అనంతరం టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది అక్రమ నిర్మాణం కూల్చివేత ప్రక్రియను చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని