- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
KCR: ఆ కేసు కొట్టేయండి.. హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసు విషయంలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసు విషయంలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్లో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారంటూ మల్కాజ్గిరి పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. ఎలాంటి రైల్ రోకోకు పిలుపునివ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేశారన్నారు. రైల్ రోకో ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ ఏర్పడిందని, ఈ కేసుకు ఎలాంటి బలం లేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
భారత రాష్ట్ర సమితి (భారాస)కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. భారాస నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయి. -
మేనమామనని చెప్పి చిన్నారుల పొట్ట కొట్టాడా?: అధికారులతో మంత్రి లోకేశ్
మధ్యాహ్న భోజన పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలపై మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
-
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?